News November 4, 2024

రైతన్నలూ.. ఒక్కసారి ఆలోచించండి, ప్రాణాలు కాపాడండి!

image

రోడ్లపై వడ్ల కుప్పలతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వరికోతలు ముమ్మరంగా సాగుతుండటంతో కొనుగోలు కేంద్రాలకు పెద్దఎత్తున ధాన్యం వస్తోంది. అక్కడ స్థలం సరిపోక చాలా మంది రైతులు రోడ్లపై వడ్లను ఆరబోస్తున్నారు. రాత్రి వేళ కుప్పలు, రాళ్లు కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. సగం రోడ్డుపైనే వాహనాలు వెళ్లాల్సి వస్తోంది. కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నా రైతులు పట్టించుకోవట్లేదు.

Similar News

News November 17, 2025

బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై ‘బ్లూ బుక్’: మోదీ

image

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఇంజినీర్లు తమ అనుభవాలను ఎప్పటికప్పుడు రికార్డు చేయాలని PM మోదీ సూచించారు. తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు నుంచి నేర్చుకున్న విషయాలను ‘బ్లూ బుక్’లా సంకలనం చేయాలని చెప్పారు. ఏం చేశారనేదే కాకుండా ఒక్కో నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే విషయం భవిష్యత్ టీమ్స్‌కు తెలుస్తుందని తెలిపారు. సూరత్‌లోని రైల్వే కారిడార్‌లో ఇంజినీర్లు, కార్మికులతో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు.

News November 17, 2025

ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

image

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఈనెల 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది.

News November 17, 2025

ఢిల్లీ పేలుడు: ఏమిటీ డెడ్ డ్రాప్?

image

ఢిల్లీ పేలుడు కేసు నిందితులు ‘డెడ్ డ్రాప్’ ఈ-మెయిల్ విధానం వాడినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఒకే మెయిల్ IDతో రహస్యంగా సమాచార మార్పిడి చేసుకోవడమే ‘డెడ్-డ్రాప్’ పద్ధతి. సమాచారాన్ని డ్రాఫ్ట్‌లో సేవ్ చేస్తే, దాన్ని అవతలి వ్యక్తి చూస్తారు. తర్వాత అప్డేట్ లేదా డిలీట్ చేస్తారు. ఇందులో మెయిల్ పంపడం, రిసీవ్ చేసుకోవడమనేదే ఉండదు. దీన్ని గుర్తించడం చాలా కష్టమని అధికారులు అంటున్నారు.