News January 8, 2025
MHలో అన్ని వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి

మహరాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది APR 1 నుంచి అన్ని వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులకు ఫుల్స్టాప్ పెట్టాలని భావిస్తోంది. అటు ‘ఒక వాహనం, ఒక ఫాస్టాగ్’ విధానాన్ని NHAI పకడ్బందీగా అమలు చేస్తోంది. ఒకే ఫాస్టాగ్ మల్టిపుల్ వెహికల్స్కు వాడటం, పలు పాస్టాగ్లు ఒకే వాహనానికి వినియోగించడాన్ని అరికట్టడానికి ఈ విధానాన్ని తీసుకొచ్చింది.
Similar News
News August 27, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News August 27, 2025
ఈ రోజు నమాజ్ వేళలు(ఆగస్టు 27, బుధవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.47 గంటలకు ✒ సూర్యోదయం: ఉదయం 6.01 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12.18 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4.44 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 6.34 గంటలకు ✒ ఇష: రాత్రి 7.48 గంటలకు ✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News August 27, 2025
దర్శకుడిగా మారనున్న తమిళ హీరో

తమిళ హీరో జయం రవి దర్శకుడిగా మారనున్నారు. కమెడియన్ యోగి బాబు ప్రధాన పాత్రలో కామెడీ ఎంటర్టైనర్ను తెరకెక్కిస్తానని ఆయన ప్రకటించారు. తన ప్రొడక్షన్ బ్యానర్ రవిమోహన్ స్టూడియోస్ లాంఛ్ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. జయం రవిగా అందరికీ పరిచయమైన ఆయన తన పేరును రవి మోహన్గా మార్చుకున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రకటించారు. మరోవైపు సుధా కొంగర ‘పరాశక్తి’లో రవి నటిస్తున్నారు.