News January 8, 2025

MHలో అన్ని వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి

image

మహరాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది APR 1 నుంచి అన్ని వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులకు ఫుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తోంది. అటు ‘ఒక వాహనం, ఒక ఫాస్టాగ్’ విధానాన్ని NHAI పకడ్బందీగా అమలు చేస్తోంది. ఒకే ఫాస్టాగ్ మల్టిపుల్ వెహికల్స్‌కు వాడటం, పలు పాస్టాగ్‌లు ఒకే వాహనానికి వినియోగించడాన్ని అరికట్టడానికి ఈ విధానాన్ని తీసుకొచ్చింది.

Similar News

News January 21, 2026

నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా, జైలు శిక్ష

image

నిబంధనలను ఉల్లంఘించి పురుగు మందులను తయారు చేసినా, దిగుమతి చేసుకున్నా నేరం. వీటి విక్రయాల వల్ల ఎవరైనా మరణించినా లేదా గాయపడినా తయారీదారులను బాధ్యులను చేస్తూ ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. తొలిసారి నేరానికి రూ.10లక్షలు- రూ.50 లక్షలు, రెండోసారి అదే తప్పు చేస్తే, గతంలో విధించిన జరిమానా కంటే రెట్టింపు వసూలు చేస్తారు. రిపీటైతే లైసెన్స్ రద్దు, ఆస్తులను జప్తు చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది.

News January 21, 2026

రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ.. అంతా ఉత్తిదే!

image

సోషల్ మీడియాలో RGF(రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ) తెగ వైరలవుతోంది. ఓ యూట్యూబర్ చేసిన తుంటరి పని దీనికి కారణమని సమాచారం. హీరో రాజశేఖర్‌ను ఓనర్‌గా పేర్కొంటూ ఓ వీడియో చేయగా ఫేక్ అపాయింట్‌మెంట్స్, ఐడీ కార్డ్స్, శాలరీలు అంటూ పోస్టులు పుట్టుకొచ్చాయి. ఇందులో ఏదీ నిజం కాదని, ఒకరిని చూసి మరొకరు ట్రెండ్ చేస్తున్నారని తెలుస్తోంది. యూట్యూబ్‌లో వచ్చే ఇలాంటి వీడియోలను గుడ్డిగా నమ్మొద్దని పలువురు సూచిస్తున్నారు.

News January 21, 2026

23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ

image

TG: రికార్డు స్థాయిలో ఈ వారం 23 వేల మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.261.51 కోట్లు చెల్లించినట్లు హౌసింగ్ ఎండీ గౌతం తెలిపారు. ఈ మార్చికల్లా లక్ష ఇళ్లను పూర్తి చేయడంతో పాటు తదుపరి దశను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2.5 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమైనట్లు వెల్లడించారు. ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో రూ.4,351 కోట్లకు పైగా నిధులు విడుదల చేశామన్నారు.