News April 29, 2024
ఘోర రోడ్డు ప్రమాదం.. 9మంది మృతి

ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న వ్యాన్ను కారు ఢీకొట్టింది. దీంతో 9మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
> రోడ్డుపై ప్రయాణించేటప్పుడు మీ కుటుంబాన్ని గుర్తుంచుకోండి.. జాగ్రత్తగా నడపండి.
Similar News
News January 29, 2026
జుట్టు జిడ్డు ఇలా తగ్గిద్దాం..

కాలుష్యం, దుమ్మూ తోడై కొందరి జుట్టు త్వరగా జిడ్డుగా మారుతుంది. దానికోసం ఈ చిట్కాలు.. * షాంపూలో స్పూన్ కలబంద, కాస్త నిమ్మరసం చేర్చి బాగా కలిపి తలకు పెట్టుకోవాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి. * రెండు స్పూన్ల ముల్తానీమట్టికి తగినంత నీరు కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. * తలస్నానం చేసిన జుట్టుకు బ్లాక్ టీని పట్టించి ఇరవైనిమిషాల తర్వాత కడిగేయాలి.
News January 29, 2026
ఈరోజు అన్నం తినకూడదా?

నేడు భీష్మ ఏకాదశి. ఈ తిథి నాడు అన్నం తినొద్దంటారు. అందుకు 3 కారణాలున్నాయి. ఏకాదశి నాడు పాపపురుషుడు బియ్యంలో ఉంటాడని, దాంతో వండిన పదార్థాలు తింటే చెడు జరుగుతుందని భవిష్య పురాణం చెబుతోంది. బియ్యంలోని తామసిక లక్షణాలు బద్ధకాన్ని పెంచుతాయి. పూజలకు ఆటంకం కలిగిస్తాయి. చంద్రుడి ప్రభావంతో జీర్ణక్రియ మందగిస్తుందని కూడా అంటారు. ఏకాదశి ఉపవాసం ఎలా ఉండాలి, ఏం తినాలి, ఏం తినకూడదో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.
News January 29, 2026
మొక్కజొన్న పంట సాగు- ఏ భూమిలో ఎంత నీరివ్వాలి?

నల్లరేగడి నేలల్లో మొక్కజొన్న సాగు చేస్తే పంట కాలంలో 5-6 తడులు, ఎర్రనేలల్లో సాగు చేస్తే 8 నీటి తడులివ్వాలి. 6 తడులే ఇవ్వడానికి ఛాన్సుంటే మొలక దశ, పంట అడుగున్నర ఎత్తు దశ, పూత దశ, పూత దశ నుంచి గింజ పాలుపోసుకునే దశలో రెండుసార్లు, గింజ నిండే దశలో ఒకసారి నీరివ్వాలి. తక్కువ నీటి తడులున్న మెట్ట ప్రాంతాలలో బిందుసేద్యంతో నీటిని అందిస్తే 25-50% నీటి ఆదాతో పాటు ఎక్కువ విస్తీర్ణంలో మొక్కజొన్నను పండించవచ్చు.


