News September 30, 2024
‘బురారీ’ తరహాలోనే తండ్రి, నలుగురు కూతుళ్లు ఆత్మహత్య!
2018లో ఢిల్లీ బురారీలోని ఇంట్లో 11 మంది ఆత్మహత్య చేసుకోవడం సంచలనమైంది. తాజాగా దేశ రాజధానిలోని వసంత్కుంజ్లో తండ్రి, నలుగురు కూతుళ్లు సూసైడ్ చేసుకున్నారు. ఇది కూడా బురారీ ఘటన తరహాలో తాంత్రిక పూజల్లో భాగంగానే జరిగిందనే అనుమానాలొస్తున్నాయి. వారి మెడ, మణికట్టుకు ఎరుపు, పసుపు దారాలను పోలీసులు గుర్తించారు. వారంతా విషం కలిపిన స్వీట్లను తిన్నట్లు తేల్చారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News September 30, 2024
‘తండేల్’ సాంగ్ షూటింగ్లో చైతూ-సాయి పల్లవి
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కిస్తోన్న ‘తండేల్’ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం సినిమాలోని శివపార్వతుల సాంగ్ చిత్రీకరణ జరుగుతోందని మేకర్స్ తెలిపారు. ఈ మేరకు షూటింగ్ ఫొటోలను పంచుకున్నారు. ఇందులో డాన్సర్లతో కలిసి చైతూ, సాయి పల్లవి స్టెప్పులేసే సన్నివేశాన్ని చూపించారు. ఇద్దరి కాంబో చూడముచ్చటగా ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
News September 30, 2024
‘పుష్ప-3’ గురించి క్రేజీ న్యూస్!
పుష్ప-2 సినిమా ఎండింగ్లో మూడో పార్ట్ గురించి డైరెక్టర్ సుకుమార్ ఓ అదిరిపోయే లీడ్ ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. క్లైమాక్స్లో ఓ పాపులర్ స్టార్ ఎంట్రీ ఇస్తారని, అది మూడో పార్ట్కు లీడ్గా మారుతుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాసిల్ తదితరులు నటిస్తున్న ‘పుష్ప-2’ డిసెంబర్ 6న థియేటర్లలో రిలీజ్ కానుంది.
News September 30, 2024
భారత్ WTC ఫైనల్కు వెళ్లాలంటే..
టీమ్ ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్కు వెళ్లేందుకు అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ప్రస్తుతం బంగ్లాతో జరుగుతోన్న రెండో టెస్టు డ్రా అయితే మిగతా 8 మ్యాచుల్లో ఐదింట్లో గెలవాల్సి ఉంటుంది. భారత్ న్యూజిలాండ్తో 3, ఆస్ట్రేలియాతో 5 టెస్టులు ఆడాల్సి ఉంది. ఇందులో 5 గెలిచి, ఒక మ్యాచ్ డ్రా అయితే మిగతా టీంలపై ఆధారపడకుండా టీమ్ ఇండియా నేరుగా FINALకు వెళ్తుంది.