News March 16, 2025
పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య.. కొత్త విషయాలు

కాకినాడలో చంద్రశేఖర్ అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. గతంలో పెద్ద కొడుకు జోషిల్ (6)ను రూ.లక్షల్లో ఫీజులు ఉన్న ఓ స్కూల్లో చేర్పించాడు. ఆర్థిక ఇబ్బందులతో చిన్న స్కూలుకు మార్చాడు. లక్షలు కట్టి చదివించగలనా? ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడగలరా? అనే ఆత్మన్యూనతతో ఇలా చేసినట్లు భావిస్తున్నారు. చంద్రశేఖర్ అంత కర్కశుడు కాదని బంధువులు చెబుతున్నారు.
Similar News
News March 16, 2025
పవన్ BJP మైకం నుంచి బయటపడాలి: షర్మిల

AP: Dy.CM పవన్ చేగువేరా, గద్దర్ సిద్ధాంతాలకు నీళ్లొదిలేశారని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ఇప్పుడు మోదీ, అమిత్ షా సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకున్నారని ఎద్దేవా చేశారు. RSS భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నారని, జనసేన పార్టీని ‘ఆంధ్ర మతసేన’గా మార్చారని ధ్వజమెత్తారు. మత పిచ్చి, BJP ఆశయాలను అలవరుచుకోవడం దురదృష్టకరమన్నారు. పవన్ ఇప్పటికైనా ఆ పార్టీ మైకం నుంచి బయటపడాలని సూచించారు.
News March 16, 2025
OTD: సచిన్ సెంచరీల సెంచరీ

సచిన్ టెండూల్కర్ అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించి నేటికి 13 ఏళ్లు అయింది. మార్చి 16, 2012లో బంగ్లాపై సెంచరీ చేసి అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు చేసిన తొలి బ్యాటర్గా నిలిచారు. సచిన్ 99 సెంచరీలు చేసి 100 శతకాలు పూర్తి చేయడానికి ఏడాదికి పైగా (369రోజులు) సమయం పట్టింది. ఇప్పటి వరకు మాస్టర్ బ్లాస్టర్ రికార్డ్ చెక్కుచెదరకపోగా, యాక్టివ్ ప్లేయర్లలో కోహ్లీ(82) ఒక్కరే ఆ మైలురాయికి దగ్గర్లో ఉన్నారు.
News March 16, 2025
ట్యాంక్ బండ్పై ఆంధ్రుల విగ్రహాలు తొలగించే దమ్ముందా: బండి

TG: పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్చాల్సిన అవసరం ఏంటని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఆయన గొప్ప దేశభక్తుడని, ఏపీ మూలాలుంటే పేర్లను మార్చేస్తారా అని నిలదీశారు. NTR, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి పేర్లను కూడా మారుస్తారా అని అన్నారు. ట్యాంక్ బండ్పై ఆంధ్రుల విగ్రహాలు తొలగించే దమ్ముందా అని ప్రశ్నించారు. తక్షణమే చేసిన తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు.