News March 16, 2025

పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య.. కొత్త విషయాలు

image

కాకినాడలో చంద్రశేఖర్ అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. గతంలో పెద్ద కొడుకు జోషిల్ (6)ను రూ.లక్షల్లో ఫీజులు ఉన్న ఓ స్కూల్లో చేర్పించాడు. ఆర్థిక ఇబ్బందులతో చిన్న స్కూలుకు మార్చాడు. లక్షలు కట్టి చదివించగలనా? ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడగలరా? అనే ఆత్మన్యూనతతో ఇలా చేసినట్లు భావిస్తున్నారు. చంద్రశేఖర్ అంత కర్కశుడు కాదని బంధువులు చెబుతున్నారు.

Similar News

News October 14, 2025

జగన్ ఆస్తుల వివాదం.. స్టేటస్ కో విధించిన NCLT

image

YS జగన్‌కు చెందిన సరస్వతి సిమెంట్స్ షేర్ల బదిలీపై చెన్నైలోని NCLT అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టేటస్ కో విధించింది. జులై 29న హైదరాబాద్ NCLT బెంచ్ జగన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. జగన్ తల్లి, చెల్లెలి పేరిట రాసిన గిఫ్ట్ డీడ్‌లో షేర్లు పూర్తిగా బదిలీ కాలేదని, అందువల్ల అవి జగన్ వద్దే ఉన్నట్లు తెలిపింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ వైఎస్ విజయమ్మ చెన్నై బెంచ్‌లో అప్పీల్ చేయగా దానిపై స్టేటస్ కో విధించింది.

News October 14, 2025

సరైన నిద్ర లేకపోతే కంటి సమస్యలు!

image

కంటినిండా నిద్రలేకపోతే కళ్లపై ఎఫెక్ట్ పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గాఢనిద్రలో కళ్లు సహజంగా కన్నీళ్లను ఉత్పత్తి చేస్తాయని, దీనివల్ల అవి మృదువుగా ఉంటాయని అంటున్నారు. నిద్ర సరిగా లేకపోతే కళ్లు పొడిబారిపోతాయని చెబుతున్నారు. దీర్ఘకాలికంగా ఇదే కంటిన్యూ అయితే రెటీనా పనితీరు మందగించి చూపు తగ్గుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. రోజుకు 6-8 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు.
Share it

News October 14, 2025

ఎంత సంపాదించినా డబ్బు మిగలట్లేదా?

image

చేతిలో ధనం నిలవనివారు 21 రోజుల సంకల్పాన్ని పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ఫలితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందంటున్నారు. ‘రోజూ ఉదయం లక్ష్మీదేవిని ప్రార్థించి, కొంత డబ్బును హుండీలో వేయండి. అనవసర ఖర్చులు చేయకూడదనే నియమం పెట్టుకోండి. సాయంత్రం వచ్చాక, ఖర్చు చేయకుండా ఆపగలిగిన డబ్బును అందులో వేయండి. ఈ ఆచరణ 21 రోజులు పాటిస్తే దైవ కృపతో ఆర్థిక సుస్థిరత సాధిస్తారు’ అని అంటున్నారు. <<-se>>#DHARMASANDEHALU<<>>