News May 11, 2024

తెనాలిలో తండ్రి, కూతురు, మనమరాలు గెలుపు!

image

గుంటూరు(D) తెనాలి రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం. ఇక్కడి రాజకీయాల్లో ఓ కుటుంబం చిరస్థాయిగా నిలిచిపోయింది. 1952,55,62లో ఆలపాటి వెంకట రామయ్య MLAగా గెలుపొందగా.. ఆయన కుమార్తె దొడ్డపనేని ఇందిర కూడా 1967, 72, 78 ఎన్నికల్లో విజయం సాధించారు. వారి తదనంతరం 1999లో ఆలపాటి మనమరాలు గోగినేని ఉమ MLAగా నెగ్గి.. ఎక్కువ మంది MLAలున్న కుటుంబంగా చరిత్ర సృష్టించారు. <<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News September 19, 2025

టుడే టాప్ స్టోరీస్

image

* జీఎస్టీ సంస్కరణలతో పేదల జీవితాలు మారతాయి: CM చంద్రబాబు
* ఢిల్లీకి సీఎం రేవంత్.. పెట్టుబడులపై కంపెనీల ప్రతినిధులతో రేపు భేటీ
* ప్రజల గొంతు వినాలని ప్రభుత్వానికి లేదు: జగన్
* నకిలీ ఓట్ల వెనుక ఎవరున్నారో తెలియాలి: రాహుల్ గాంధీ
* ఓట్ల చోరీ ఆరోపణలు చేయడం రాహుల్‌కు అలవాటుగా మారింది: BJP
* OCT 1 నుంచి అమల్లోకి ఆన్‌లైన్‌ గేమింగ్‌ చట్టం: కేంద్రం
* లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

News September 19, 2025

బగ్రామ్ ఎయిర్‌బేస్‌ స్వాధీనం చేసుకోవాలి: ట్రంప్

image

అఫ్గానిస్థాన్‌లోని బగ్రామ్ ఎయిర్‌బేస్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. గత ప్రెసిడెంట్ జోబైడెన్ ఎలాంటి ప్రయోజనం లేకుండానే ఆ స్థావరాన్ని వదిలేశారని విమర్శించారు. చైనా అణ్వాయుధ ఉత్పత్తి కేంద్రాల నుంచి కేవలం గంటలోనే ఈ ఎయిర్‌బేస్‌కు చేరుకోవచ్చని తెలిపారు. భవిష్యత్తులో చైనా ఈ స్థావరాన్ని చేజిక్కించుకుంటుందన్న అనుమానంతోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

News September 19, 2025

ఈ అసెంబ్లీ సమావేశాలకూ వైసీపీ దూరం?

image

AP: YCP MLAలు అసెంబ్లీకి రావాలని స్పీకర్ అయ్యన్న పదేపదే కోరినా.. ఇవాళ YCP సభ్యులెవరూ సమావేశాలకు రాలేదు. ఇదే సమయంలో ఆ పార్టీ LP సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. మండలి సభ్యులే బలంగా పోరాడాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయించుకునే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని జగన్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు.