News August 24, 2024
తండ్రయిన పాక్ పేసర్ షాహీన్

పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రీది తండ్రయ్యారు. అతని భార్య అన్షా ఇవాళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ చిన్నారికి అలీ యార్గా పేరు పెట్టినట్లు అఫ్రీది కుటుంబసభ్యులు వెల్లడించారు. మాజీ క్రికెటర్ షాహీద్ అఫ్రీది కుమార్తెనే అన్షా. దీంతో అతను 47 ఏళ్లకే తాత అయ్యారు. కాగా బిడ్డతో గడిపేందుకు వీలుగా షాహీన్ బంగ్లాదేశ్తో జరిగే రెండో టెస్టుకు దూరం కానున్నట్లు సమాచారం.
Similar News
News March 23, 2026
ఖాళీ స్టేడియాల్లో PSL

పాక్ సూపర్ లీగ్ పతనం దిశగా సాగుతోంది. మెజార్టీ విదేశీ ఆటగాళ్లు IPL వైపు మొగ్గుచూపుతుండగా, భద్రతా కారణాలతో పలువురు అక్కడికి వెళ్లట్లేదు. ఈ క్రమంలో ఈసారి ప్రేక్షకులు లేకుండా కేవలం 2 వేదికల్లోనే మ్యాచ్లను నిర్వహిస్తున్నట్లు PCB ఛైర్మన్ నఖ్వీ వెల్లడించారు. పొదుపు చర్యల్లో భాగంగానే ఇలా చేస్తున్నట్లు తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశంలో ఆర్థిక, ఇంధన సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే.
News March 23, 2026
యుద్ధంతో అమెరికాకు ₹7,520 కోట్ల నష్టం

పశ్చిమాసియాలోని అమెరికన్ మిలిటరీ బేస్లపై ఇరాన్ జరిపిన వైమానిక దాడుల వల్ల USకు ₹7,520 కోట్ల నష్టం వాటిల్లిందని BBC, CSIS నివేదిక వెల్లడించింది. యుద్ధం మొదలైన తొలి 2 వారాల్లోనే ఈ నష్టం జరిగినట్లు అంచనా. జోర్డాన్లోని థాడ్ రాడార్ వ్యవస్థ ధ్వంసం అవ్వడం వల్ల సుమారు ₹4,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు US డిఫెన్స్ సిస్టమ్స్ను ఛేదించి ఈ విధ్వంసం సృష్టించాయి.
News March 23, 2026
ఖరీఫ్కు కష్టమే.. తగ్గిన యూరియా తయారీ!

హార్ముజ్ జలసంధి మూతపడటంతో భారత్కు రావాల్సిన LNG సరఫరా నిలిచిపోయింది. దీంతో దేశీయంగా యూరియా ఉత్పత్తి 50% పైగా పడిపోయింది. గ్యాస్ కొరత వల్ల గెయిల్, IOC వంటి సంస్థలు యూరియా ప్లాంట్లకు సప్లై తగ్గించాయి. ఫలితంగా వచ్చే ఖరీఫ్ సీజన్కు అవసరమైన 170-180 లక్షల టన్నుల యూరియా లభ్యతపై ఆందోళన మొదలైంది. ప్రస్తుతం దేశంలో కేవలం 62 లక్షల టన్నుల నిల్వలు మాత్రమే ఉన్నాయి. చైనా నుంచి కూడా దిగుమతులు తగ్గాయి.


