News June 17, 2024
‘నాన్ క్యాష్ పేమెంట్స్’కే మొగ్గు

ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ వాడే భారతీయులు నాన్ క్యాష్ పేమెంట్స్కే మొగ్గు చూపుతున్నారు. క్యాష్(భౌతిక నగదు)కు బదులుగా UPI, డెబిట్, క్రెడిట్ కార్డు, డిజిటల్ వ్యాలెట్స్తో పేమెంట్స్ చేస్తున్నారు. దీంతో ఆరేళ్ల క్రితం 20.4%గా ఉన్న నాన్ క్యాష్ పేమెంట్స్ ఇప్పుడు ఏకంగా 58.1%కి చేరింది. ఈ పేమెంట్స్లో ఆసియా పసిఫిక్ రీజియన్లో చైనా ముందుండగా, ఆ తర్వాత ఇండియా, ఇండోనేషియా ఉన్నట్లు 2023 నివేదికలు చెబుతున్నాయి.
Similar News
News January 19, 2026
ఈ సమ్మర్లో మిక్స్డ్ వెదర్

ఈసారి ఎండాకాలంలో మిక్స్డ్ వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఎల్నినో ప్రభావం చూపే అవకాశం ఉందని, ఓ వైపు ఎండలతో పాటు వానలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. 2023కు మించిన ఎండలు, మేతో పాటు జూన్ ప్రారంభంలో తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు చలి ప్రభావం తగ్గుముఖం పడుతుందని తెలిపారు.
News January 19, 2026
చార్ధామ్ యాత్ర.. టెంపుల్స్లోకి మొబైల్స్ బంద్

చార్ధామ్ యాత్రలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించేందుకు, సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పించడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాల్లోకి మొబైల్స్, కెమెరాలు తీసుకెళ్లడంపై నిషేధం విధించింది. వీటి వినియోగంతో దర్శన సమయంపై ప్రభావం పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. మొబైల్స్, కెమెరాలు సేఫ్గా ఉంచడానికి టెంపుల్స్ వద్ద అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
News January 19, 2026
సంతానలేమిని నివారించే ఖర్జూరం

ఖర్జూరాలు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడతాయని.. మగవారిలో సంతానలేమి సమస్యను నివారించడంలో ఉపయోగపడతాయని పలు అధ్యయనాల్లో తేలింది. వీటిలో ఉన్న పొటాషియం నరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఖర్జూరాల్లో అధికంగా ఉండే పీచు జీర్ణ ప్రక్రియకు మంచిది. ఇందులోని కెరోటనాయిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే ఐరన్, విటమిన్ C, D, విటమిన్ B కాంప్లెక్స్ గర్భిణులకు మంచివని చెబుతున్నారు.


