News August 11, 2025

AI భయం.. ఉద్యోగం భద్రమేనా?

image

AI ఎంట్రీతో టెక్ కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగాల కోత విధిస్తుండటంతో తమ జాబ్ ఉంటుందో ఊడుతుందోనని IT ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గతంలో సాఫ్ట్‌వేర్ అని గర్వంగా చెప్పిన గొంతులు నేడు బొంగురుపోయే పరిస్థితి తలెత్తింది. ప్రాజెక్టులు ఆగిపోవడం, తొలగింపులు పెరగడంతో ఉద్యోగ భద్రత, AI ప్రభావంపై చర్చ మొదలైంది. ఇది తాత్కాలికమా? మళ్లీ పునర్వైభవం వస్తుందా? అంటూ తమ భవిష్యత్తుపై ఉద్యోగులు బెంగపెట్టుకుంటున్నారు.

Similar News

News August 12, 2025

TODAY HEADLINES

image

* భారత్ ఎవరికీ తలవంచదు: సీఎం చంద్రబాబు
* AP DSC ఫలితాలు విడుదల
* తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
* షూటింగ్‌లు బంద్ చేయడం సరికాదు: కోమటిరెడ్డి
* కాంగ్రెస్ చేతకానితనంతో ఎకానమీ పతనమవుతోంది: KTR
* పులివెందులలో టీడీపీ రిగ్గింగ్ కుట్రలు: అవినాశ్
* హీరో రానాను విచారించిన ఈడీ
* తగ్గిన బంగారం ధరలు
* ‘మాస్ జాతర’ టీజర్ విడుదల

News August 12, 2025

బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఉగ్రవాద సంస్థ: US

image

బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(BLA), దాని సహచర సంస్థ మజీద్ బ్రిగేడ్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా అమెరికా ప్రకటించింది. కొన్ని దాడుల తర్వాత 2019లో BLAను స్పెషల్లీ డెజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్‌గా గుర్తించారు. 2019నుంచి మజీద్ బ్రిగేడ్ ద్వారా జరిగిన దాడులకు BLA బాధ్యత వహించినట్లు పేర్కొంది. ఇటీవలదాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కానీ, ఇది పాకిస్థాన్ కోసం చేశారంటూ విమర్శలు వస్తున్నాయి.

News August 12, 2025

భారత్ ఎవరికీ తలవంచదు: చంద్రబాబు

image

AP: పీఎం నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం శక్తిమంతంగా ఎదుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. భారత్ ఎవరికీ తల వంచదని, దేశం జోలికి ఎవరొచ్చినా వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. విజయవాడలో జరిగిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ‘టారిఫ్స్ విధిస్తే భారత్ ఆగిపోతుందనుకోవడం భ్రమే. మనకు ఉద్యోగాలు ఇవ్వని దేశాల్లోనే అభివృద్ధి నిలిచిపోతుంది. ఇప్పుడు ఉన్నది పవర్ ఫుల్ ఇండియా’ అని ఆయన వ్యాఖ్యానించారు.