News March 22, 2024

ప్రధాని మోదీ కళ్లలో ఓటమి భయం కనిపిస్తోంది: స్టాలిన్

image

తిరుచిరాపల్లిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ‘ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పీఎం కేర్స్ ఫండ్ వెనుక ఉన్న రహస్యాలను బయటపెడతాం. కేజ్రీవాల్ అరెస్ట్ కావడానికి బీజేపీకి ఓటమి భయం పట్టుకోవడమే కారణం. మోదీ కళ్లలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రం కోసం తెచ్చినట్టు ప్రధాని ఒక్క స్కీమ్ పేరైనా చెప్పగలరా?’ అని ప్రశ్నించారు.

Similar News

News December 24, 2025

గర్భనిరోధక మాత్ర ఎలా పని చేస్తుందంటే?

image

ఈ టాబ్లెట్లలో లెవోనోర్‌జెస్ట్రల్‌ అనే హార్మోన్‌ ఉంటుంది. ఇది సహజంగా లభించే స్త్రీ సెక్స్ హార్మోన్ ప్రొజెస్టెరాన్ సింథటిక్ వెర్షన్. ఓవులేషన్ సమయంలో అండం విడుదల అవుతుంది. అయితే ఈ టాబ్లెట్‌ తీసుకోవడం వల్ల ఆ ప్రక్రియ వాయిదా పడుతుంది. అండం ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేయడం, ఫలదీకరణాన్ని నిరోధించడం వంటివి చేస్తుంది. అలాగే ఫలదీకరణం అయిన అండం గర్భాశయంలో అమర్చబడకుండా చేసి గర్భధారణను నిరోధిస్తుంది.

News December 24, 2025

శని దోషమా? ఇవి దానం చేయండి..

image

పుష్య మాసంలో చేసే చిన్న దానమైనా శని దోషాల నుంచి విముక్తి కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు. జాతకంలో శని ప్రభావం ఉన్నవారు అన్నదానం, వస్త్రదానం చేయాలంటున్నారు. ‘చలి తీవ్రత ఎక్కువగా ఉండే ఈ రోజుల్లో కంబళ్లు, దుప్పట్లు దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. శని దేవుడికి ప్రీతికరమైన ఈ మాసంలో కొన్ని సరళమైన పరిహారాలతో శని బాధలను తగ్గించుకోవచ్చు’ అంటున్నారు. ఆ పరిహారాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

News December 24, 2025

విత్తనాలు కొనేటప్పుడు రశీదు కీలకం

image

విత్తన రకం, లాట్ నంబర్, గడువు తేదీ తదితర వివరాలను సరిచూసుకొని విత్తనాలను కొనాలి. విత్తనాన్ని కొనుగోలు చేసిన తర్వాత అధీకృత డీలర్ నుంచి కొనుగోలు రశీదు తప్పకుండా తీసుకోవాలి. దీనిపై రైతు మరియు డీలర్ సంతకం తప్పకుండా ఉండాలి. పంటకు విత్తనం వల్ల నష్టం జరిగితే రైతుకు విత్తన కొనుగోలు రశీదే కీలక ఆధారం. అందుకే ఆ రశీదును పంటకాలం పూర్తయ్యేవరకు జాగ్రత్తగా ఉంచాలి. పూత, కాత రాకపోతే నష్టపరిహారానికి రశీదు అవసరం.