News March 30, 2025
పరీక్షల భయం.. అమ్మాయి ఆత్మహత్య

వైద్యవిద్యలో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్ష ఒత్తిడి భరించలేక తమిళనాడు చెన్నైకి చెందిన 21 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇప్పటికే మూడు సార్లు NEETలో ఫెయిల్ అయిన దేవదర్శిని.. మేలో మళ్లీ ఎగ్జామ్ రాసేందుకు ప్రిపేర్ అవుతోంది. తరచూ విఫలం అవుతుండటం, సమయం వృథా కావడం, కుటుంబ ఆర్థిక సమస్యలతో సతమతం అయిన ఆమె ఇవాళ ఉరేసుకుంది.
Similar News
News December 28, 2025
దుర్గగుడిలో పవర్ కట్.. ఏం జరిగిందంటే?

AP: నిన్న విజయవాడ దుర్గగుడిలో 3 గంటల పాటు పవర్ కట్ చేయడం సంచలనంగా మారింది. మూడేళ్లకు కలిపి రూ.4.5 కోట్ల బిల్లులు ఉన్నాయని విద్యుత్ అధికారులు కరెంట్ కట్ చేశారు. అయితే దుర్గామాత ఆలయ భూముల్లో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్తును 2023 నుంచి విద్యుత్ శాఖకు ఇస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు. నెట్ మీటరింగ్ జీరో అవుతుందని, బిల్లులు ఎందుకు చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు. ఈ పంచాయితీపై CMO సీరియస్ అయింది.
News December 28, 2025
బంగ్లా ‘యాంటీ ఇండియా’ మంత్రం

బంగ్లాదేశ్లో ర్యాడికల్ స్టూడెంట్ లీడర్ హాదీ హత్యను అక్కడి ఇస్లామిస్ట్ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయి. నిరసనలతో దేశాన్ని స్తంభింపజేస్తున్నాయి. భారత్, ప్రధాని మోదీ వ్యతిరేక నినాదాలు చేస్తున్నాయి. ప్రస్తుతం ‘భారత వ్యతిరేక’ ధోరణి అక్కడ బలమైన శక్తిగా మారిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల్లో గెలవాలనుకునే ఏ పార్టీ అయినా ఈ భావోద్వేగాలను విస్మరించలేని పరిస్థితి.
News December 28, 2025
వన్డేల్లోకి ఇషాన్ కిషన్ రీఎంట్రీ?

SMATలో సత్తా చాటిన ఇషాన్ కిషన్ రెండేళ్ల తర్వాత తిరిగి వన్డేల్లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. JAN 11 నుంచి న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్కు ఆయనను ఎంపిక చేసే అవకాశం ఉందని క్రీడా వర్గాలు వెల్లడించాయి. కిషన్ తన చివరి వన్డే 2023 అక్టోబర్లో అఫ్గానిస్థాన్తో ఆడారు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్లలో ఆయన ఒకరు. అటు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న టీ20 WCకు కిషన్ ఎంపికైన సంగతి తెలిసిందే.


