News July 27, 2024
పారిస్ ఒలింపిక్స్ విశేషాలు – 1/2

అట్టహాసంగా ప్రారంభమైన పారిస్ ఒలింపిక్స్కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 1900, 1924ల్లో ఆతిథ్యం ఇచ్చిన ఫ్రాన్స్ మళ్లీ వందేళ్ల తర్వాత ఈ పోటీలకు వేదికైంది. ఈసారి పోటీల్లో పురుషులతో దాదాపు సమానంగా మహిళా అథ్లెట్లు ఉండటం విశేషం. అథ్లెట్లలో 5,630 మంది పురుషులు, 5,416 మంది మహిళలు ఉన్నారు. అందుకే దీనిని ఒలింపిక్స్ చరిత్రలో లింగసమానత్వం సాధించిన తొలి టోర్నీగా ఒలింపిక్ కమిటీ పేర్కొంది. <<-se>>#Olympics2024<<>>
Similar News
News January 9, 2026
TET ఫలితాలు విడుదల

AP: రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 2.48 లక్షల మంది ఎగ్జామ్స్ రాయగా 97,560 మంది ఉత్తీర్ణులైనట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు అధికారిక <
News January 9, 2026
ఇంటర్ కాలేజీలకు సెలవులు ఎప్పుడంటే?

TG: రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు విద్యాశాఖ సంక్రాంతి సెలవులను ఖరారు చేసింది. ఈ నెల 11 నుంచి 18వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ప్రకటించింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే ఈ సెలవులు ప్రకటించినట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. మరోవైపు స్కూళ్లకు ఈనెల 10నుంచి 16వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే APలో ఇంటర్ కాలేజీల సెలవులపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
News January 9, 2026
రాజాసాబ్ టికెట్ హైక్ మెమో సస్పెండ్

రాజాసాబ్ మూవీ టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వ మెమోను హైకోర్టు కొట్టేసింది. దీంతో పాత రేట్లకే టికెట్లు విక్రయించాల్సి ఉంటుంది. కాగా తెలంగాణ హోంశాఖ కార్యదర్శి అర్ధరాత్రి తర్వాత హైక్ మెమో ఇచ్చారని, తనకు ఆ అధికారం లేదని లాయర్ శ్రీనివాస్ HCకి వెళ్లారు. దీంతో ఇకపై మెమోలు జారీ చేయొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒకవేళ రేట్స్ పెంచాలి అనుకుంటే జీవో 120 ప్రకారం రూ.350 మించకూడదని తేల్చిచెప్పింది.


