News February 1, 2025
FEB 20లోపు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలి: MNCL కలెక్టర్

లేఅవుట్ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కల్పించిన ఎల్ఆర్ఎస్- 2020లో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 20లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనుమతి లేని నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News December 2, 2025
తిరుపతిలో విషాదం.. ఓ ఇంట్లో మూడు మృతదేహాలు

తిరుపతి సమీపంలోని దామినేడులో విషాదం నెలకొంది. ఓ ఇంట్లో కుళ్లిన మూడు మృతదేహాలు కలకలం రేపాయి. ఇవి తమిళనాడు రాష్ట్రం, గుడియాత్తంకు చెందిన సత్యరాజ్, పొన్నాగుట్టె నాయగి, మనీశ్ మృతదేహాలుగా పోలీసులు గుర్తించారు. స్థానికులకు దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా.. మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 2, 2025
పాపవినాశనం డ్యాంపై శాస్త్రవేత్తల పరిశీలన

తిరుమలలోని పాపవినాశనం డ్యాంను ముగ్గురు శాస్త్రవేత్తలు సోమవారం పరిశీలించారు. డ్యాం సేఫ్టీ ఎవల్యూషన్లో భాగంగా జలవనరుల శాఖ, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి చెందిన శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొన్నారు. నీటి నిల్వతో పాటు పలు జాగ్రత్తలపై రిమోట్ ఆపరేటింగ్ వెహికల్తో పరిశీలించారు.
News December 2, 2025
ఏపీ వాట్సాప్ గవర్నెన్స్కు అత్యధిక హిట్స్

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్కు తొలిసారిగా అత్యధిక హిట్స్ టీటీడీ వల్ల వచ్చింది. నవంబర్ 27వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన డిప్ సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం చూస్తే 1.5 లక్షల మంది భక్తులు తమ పేర్లు ఈ డిప్లో వాట్సప్ ద్వారా నమోదు చేసుకున్నారు. ఈ సేవ వచ్చిన తర్వాత 3 రోజుల్లో ఇన్ని హిట్స్ రావడం ఇదే అత్యధికమని అంటున్నారు.


