News February 1, 2025
FEB 20లోపు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలి: MNCL కలెక్టర్

లేఅవుట్ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కల్పించిన ఎల్ఆర్ఎస్- 2020లో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 20లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనుమతి లేని నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News November 10, 2025
టెన్త్ విద్యార్థులకు ‘మోదీ గిఫ్ట్’.. ఫీజు చెల్లించిన బండి

కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్.. తన నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అండగా నిలిచారు. జిల్లాలోని 4,847 మంది పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజును ఆయన తన జీతం నుంచి చెల్లించారు. రూ. 5,45,375 విలువైన చెక్కును కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగా కృష్ణారెడ్డి ద్వారా కలెక్టర్కు అందజేశారు. ఈ మొత్తాన్ని ఆయన ‘మోదీ గిఫ్ట్’ పేరుతో చెల్లించారు.
News November 10, 2025
నిర్మల్ వాసికి ఐరన్ మ్యాన్ టైటిల్

నిర్మల్ పట్టణానికి చెందిన వైద్యుడు డా. బీఎల్ నరసింహారెడ్డి అరుదైన ఘనత సాధించారు. గోవాలో నిర్వహించిన అంతర్జాతీయ పోటీలో 64 దేశాల అభ్యర్థులతో పోటీ పడి ఐరన్ మ్యాన్ టైటిల్ను గెలుచుకున్నారు. 2 కి.మీ. ఈత, 21 కి.మీ. పరుగు, 90 కి.మీ. సైక్లింగ్తో కూడిన ఈ పోటీలో ఆయన విజేతగా నిలిచారు. దాదాపు ఆరు నెలల నిరంతర శ్రమతోనే ఇది సాధ్యమైందని ఆయన తెలిపారు. పలువురు పట్టణ ప్రజలు నరసింహారెడ్డిని అభినందించారు.
News November 10, 2025
కడప శ్రీ చైతన్యలో విద్యార్థిని ఆత్మహత్య

కడప శ్రీ చైతన్య బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో తొమ్మిదో తరగతి బాలిక జస్వంతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని పులివెందుల వాసిగా సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


