News February 1, 2025
FEB 20లోపు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలి: MNCL కలెక్టర్

లేఅవుట్ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కల్పించిన ఎల్ఆర్ఎస్- 2020లో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 20లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనుమతి లేని నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News November 13, 2025
సిరిసిల్ల: కాయగూరల ధరలు పైపైకి

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతు బజార్లలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గురువారం రైతు బజార్ నిర్వహించగా కాకరకాయ కేజీ రూ.80/-, బెండకాయ 89/-, చిక్కుడుకాయ 80/-, మిర్చి 50/-, వంకాయ 89/-, క్యాప్సికం 70/- కాలీఫ్లవర్ 70/-లుగా పలుకుతోంది. ఇటీవల సంభవించిన తుఫాన్ వల్ల చాలా ప్రాంతాలలో రైతులు కూరగాయల పంటలు తీవ్రంగా నష్టపోవడంతో ధరలు కొండెక్కాయి. మరి మీ ఏరియాలో కాయగూరల ధరలు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి.
News November 13, 2025
CBN గారూ.. మీ ‘క్రెడిట్ చోరీ స్కీం’ చాలా బాగుంది: జగన్

AP: క్రెడిట్ చోరీలో మీకు మీరే సాటి అంటూ CM CBNపై YCP అధినేత జగన్ విమర్శలకు దిగారు. ‘YCP హయాంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను మేమే కట్టేశామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మీ క్రెడిట్ చోరీ స్కీం చాలా బాగుంది. 3,00,092 ఇళ్లలో ఒక్క ఇంటిపట్టా కూడా మీరు ఇవ్వలేదు. ఒక్క ఇల్లూ మంజూరు చేయించలేదు. 1,40,010 ఇళ్లు మా హయాంలోనే పూర్తయ్యే దశలో ఉన్నాయి. మరో 87వేల ఇళ్లు శ్లాబ్ లెవల్ వరకు కట్టించినవే’ అని ట్వీట్ చేశారు.
News November 13, 2025
వంటింటి చిట్కాలు

* కరివేపాకును ఎండబెట్టి పొడిచేసుకుని కూరల్లో వేసుకుని తింటే కమ్మటి వాసన వస్తుంది.
* తేనె సీసాలో రెండు మిరియాలు వేస్తే చీమలు రావు.
* బియ్యం పురుగు పట్టకూడదంటే కరివేపాకులు వేయాలి.
* కొబ్బరి ముక్కను పెరుగులో వేస్తే త్వరగా పెరుగు పాడవదు.
* నెయ్యి పేరుకుపోకుండా ఉండాలంటే మీగడ కట్టేటప్పుడు కొద్దిగా నీళ్లు చల్లాలి.
* చిటికెడు సోడా వేసి గోధుమ పిండిని తడిపితే పూరి మెత్తగా, రుచిగా ఉంటుంది.


