News February 13, 2025
ఫిబ్రవరి 13: చరిత్రలో ఈరోజు

1879: స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడు జననం (ఫొటోలో)
1913: పండితుడు, రచయిత గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి జననం
1930: సినీ గేయ రచయిత దాసం గోపాలకృష్ణ జననం
2014: ఛాయాగ్రహకుడు, దర్శకుడు బాలు మహేంద్ర మరణం
2015: తెలుగు నవలా రచయిత పి.కేశవ రెడ్డి మరణం
☛ ప్రపంచ రేడియో దినోత్సవం
Similar News
News February 2, 2026
900 మంది టీచర్ల కుటుంబాలకు జరగని న్యాయం!

AP: విధుల్లో ఉండగా 2019-2025 మధ్య అకాల మరణం పొందిన 900 మంది టీచర్ల కుటుంబాల్లో ఇంకా అంధకారం తొలగలేదు. చనిపోయిన వారి పిల్లల్లో ఒకరికి కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. కానీ ఆరేళ్లుగా అధికారులను కలుస్తున్నా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ‘6 నెలల కిందట Dy.CM పవన్ను కలవగా ఆయన CMOకు లెటర్ పంపారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News February 2, 2026
ఐసీసీ టోర్నీల్లో గతంలోనూ బహిష్కరణలు

భారత్తో జరగాల్సిన వరల్డ్ కప్ మ్యాచ్ను పాక్ ప్రభుత్వం బాయ్కాట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలలో మ్యాచ్లు రద్దవ్వడం కొత్త కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. 1996 వరల్డ్కప్లో భద్రతా కారణాలతో శ్రీలంకలో ఆడేందుకు ఆసీస్, వెస్టిండీస్ నిరాకరించాయి. దీంతో శ్రీలంకకు వాకోవర్ లభించింది. 2003 WCలో జింబాబ్వేతో మ్యాచ్ను ఇంగ్లండ్, కెన్యాతో మ్యాచ్ను న్యూజిలాండ్ బహిష్కరించాయి.
News February 2, 2026
రెబల్గా పోటీ చేస్తే 15 ఏళ్లపాటు సస్పెన్షన్: రాంచందర్ రావు

TG: మున్సి‘పోల్స్’లో పార్టీ B ఫారం పొందిన వారే పోటీలో ఉండాలని, పార్టీ ఇతర నేతలు బరి నుంచి తప్పుకోవాలని TBJP చీఫ్ రాంచందర్ రావు సూచించారు. పోటీలో కొనసాగే రెబల్స్ను 15 ఏళ్లపాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అనేక సర్వే నివేదికల ఆధారంగా గెలిచే వారినే అభ్యర్థులుగా పార్టీ నిర్ణయించిందని పేర్కొన్నారు. టికెట్లు రాని వారికి పార్టీ పరంగా పదవులు ఇస్తామని వివరించారు.


