News March 4, 2025

75% హాజరు ఉంటేనే ఫీజు రీయింబర్స్‌మెంట్

image

AP: విద్యా సంవత్సరం 2025-26 నుంచి ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(FRS) ప్రకారం హాజరు అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 75 శాతం హాజరు ఉంటేనే ఫీజురీయింబర్స్‌మెంట్ అందిస్తామని స్పష్టం చేసింది. FRSకు కావాల్సిన టెక్నాలజీని APTS అందిస్తుందని, దీనికి సాంఘిక సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుందని తెలిపింది.

Similar News

News March 4, 2025

KCRపై అనర్హత వేయాలని పిల్.. విచారణ వాయిదా

image

TG: KCR అసెంబ్లీకి రావడం లేదని దాఖలైన పిల్‌ను హైకోర్టు విచారించింది. ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయనకు సభలో ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సిన బాధ్యత ఉందని, సభకు రాని ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని పిటిషనర్ కోరారు. దీనిపై తాము జోక్యం చేసుకోవచ్చా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. పిల్‌కు అర్హత లేదని అసెంబ్లీ తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు వినిపించేందుకు పిటిషనర్ గడువు కోరడంతో 2 వారాలకు వాయిదా పడింది.

News March 4, 2025

పాకిస్థానీ అని పిలవడం నేరం కాదు: సుప్రీం కోర్టు

image

మియాన్-తియాన్, పాకిస్థానీ అని పిలవడాన్ని నేరంగా పరిగణించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఝార్ఖండ్‌కు చెందిన ఓ ఉర్దూ తర్జుమా ఉద్యోగి వద్ద ఓ వ్యక్తి ఆర్టీఐ దరఖాస్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా వారి మధ్య గొడవ జరిగి ఉద్యోగిని పాకిస్థానీ అంటూ దరఖాస్తుదారుడు దూషించాడు. అతడిపై చర్యలకు ఝార్ఖండ్ కోర్టు ఆదేశించగా అతడు సుప్రీంను ఆశ్రయించాడు. ఆ కేసు విచారణలో ధర్మాసనం తాజా తీర్పు చెప్పింది.

News March 4, 2025

BREAKING: మహిళలకు అద్దె బస్సులు.. ఉత్తర్వులు జారీ

image

TG: మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తొలి విడతలో 150 డ్వాక్రా సంఘాలకు 150 ఆర్టీసీ బస్సులను కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది. ప్రతి నెలా ఒక్కో బస్సుకు రూ.77,220 అద్దెను ఆర్టీసీ చెల్లించనుంది. మార్చి 8న మహిళా దినోత్సవం రోజున HYD పరేడ్ గ్రౌండ్‌లో 50 బస్సులను సీఎం రేవంత్, మంత్రులు ప్రారంభించనున్నారు. త్వరలోనే మరో 450 సంఘాలకు బస్సులను అందించనున్నారు.

error: Content is protected !!