News February 6, 2025
బిగ్బాస్ కంటెస్టెంట్పై మహిళా కొరియోగ్రాఫర్ కేసు

జానీ మాస్టర్పై కేసు పెట్టిన మహిళా కొరియోగ్రాఫర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ బాషాపై నార్సింగి పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేశారు. BNS 79, 67, IT చట్టం 72 కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. బాషా తన ఫోన్ కాల్ రికార్డ్ చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారన్నారు. రాజ్ తరుణ్-లావణ్య వివాదంలో శేఖర్ బాషాపై ఇప్పటికే కేసు నమోదైంది.
Similar News
News November 12, 2025
అయోడిన్ లోపంతో పిల్లల్లో ఎదుగుదల సమస్యలు

థైరాయిడ్ హార్మోన్లు, ట్రైయోడోథైరోనిన్ (T3), థైరాక్సిన్ (T4) సరైన మోతాదులో విడుదల కావడానికి అయోడిన్ చాలా అవసరం. అయితే అయోడిన్ లోపాలున్న పిల్లలు అత్యధికంగా దేశంలో ఆంధ్రప్రదేశ్లోనే 82.5% ఉన్నట్లు చిల్డ్రన్ ఇన్ ఇండియా నివేదిక తెలిపింది. దీనిలోపంతో పిల్లల్లో ఎదుగుదల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. చేపలు, సముద్ర ఆహారం, పాలు, గుడ్లు, సోయా ఉత్పత్తుల్లో అయోడిన్ అధికంగా ఉంటుంది.
News November 12, 2025
ఆస్పత్రిలో చేరిన మరో సీనియర్ నటుడు

బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద(61) ముంబై క్రిటికేర్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న దిగ్గజ నటుడు ధర్మేంద్రను నిన్న ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన గోవింద ఇంట్లో రాత్రి సమయంలో కుప్పకూలిపోయారు. దీంతో అర్ధరాత్రి ఒంటిగంటకు ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు లీగల్ అడ్వైజర్ లలిత్ బిందాల్ తెలిపారు. ఆయనకు పలు టెస్టులు చేశారని, వాటి రిజల్ట్స్ వస్తే అనారోగ్యానికి కారణం తెలుస్తుందన్నారు.
News November 12, 2025
రేపు విచారణ.. ఇవాళ క్షమాపణ!

TG: నాగార్జున ఫ్యామిలీపై అభ్యంతరకర వ్యాఖ్యల విషయంలో మంత్రి కొండా సురేఖ మరోసారి <<18263475>>క్షమాపణలు<<>> చెప్పడం చర్చకు దారితీసింది. సురేఖపై నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై రేపు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. అందుకే ఆమె ఒకరోజు ముందు ఆయనకు సారీ చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ ‘సారీ’ని స్వీకరించి నాగార్జున కేసును వెనక్కి తీసుకుంటారా? లేక ముందుకే వెళ్తారా? అనేది రేపు తేలనుంది.


