News November 15, 2024
మహిళా ఎంపీ గొప్ప మనసు.. పేద బాలికల కోసం!

NDAలో యంగెస్ట్ ఎంపీగా పేరొందిన శాంభవి చౌదరి తన ఐదేళ్ల జీతాన్ని అమ్మాయిల చదువు కోసం ఖర్చు పెట్టనున్నట్లు ప్రకటించారు. బిహార్లోని సమస్తిపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె, ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసిన బాలికలకు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ‘చదువుకుంటేనే సమస్తిపూర్ వృద్ధి చెందుతుంది’ అనే నినాదంతో ఆమె తన శాలరీని ఖర్చు పెట్టనున్నారు. దీంతో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
Similar News
News February 9, 2026
ఊటనేల దున్నినా, మట్టి పిసికినా, ఫలితం బురదే

ఊటనేల ఎప్పుడూ నీరు ఊరుతూ ఉండే, సహజంగానే చిత్తడిగా ఉండే భూమి. ఆ నేలలో ఎంత కష్టపడి నాగలితో దున్నినా లేదా చేతులతో మట్టిని పిసికి గట్టి పరచడానికి ప్రయత్నించినా దాని స్వభావం మారదు. చివరికి మిగిలేది గట్టిపడని, వ్యవసాయానికి పనికిరాని బురద మాత్రమే. కొన్నిసార్లు కొందరి మనుషుల స్వభావాన్ని ఎంత మార్చాలని ప్రయత్నించినా అవి మారవు. దాని వల్ల మన శ్రమే వృథా అవుతుందని ఈ సామెత చెబుతుంది.
News February 9, 2026
దీపారాధనలో ఏ నూనె వాడాలంటే?

దీపారాధనలో మనం వాడే నూనెను బట్టి ఆయా దేవతల అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. మహాలక్ష్మికి ఆవు నెయ్యి అత్యంత ప్రీతికరమైనది. దీనివల్ల ఐశ్వర్యం, సాత్విక గుణం పెరుగుతాయి. విష్ణుమూర్తికి, శని దేవునికి, సుబ్రహ్మణ్య స్వామికి నువ్వుల నూనె ప్రీతికరం. గణపతికి కొబ్బరి నూనె ఇష్టమైనది. అమ్మవార్లకు ఆముదం/వేప నూనె ఉపయోగిస్తారు. శనగ నూనెను దీపారాధనకు అస్సలు వాడకూడదు. తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి.
News February 9, 2026
కోహ్లీVsగంభీర్ ప్రచారంపై BCCI సెక్రటరీ ఏమన్నారంటే?

విరాట్ కోహ్లీ-కోచ్ గంభీర్ మధ్య గొడవలు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని బీసీసీఐ కార్యదర్శి సైకియా ఖండించారు. వారిద్దరికి ఎలాంటి గొడవలు లేవని తెలిపారు. వారిద్దరి మధ్య మంచి సంబంధం ఉందని చెప్పారు. టెస్టులకు రిటైర్మెంట్ విషయంలో కోహ్లీని ఎవరూ బలవంతం చేయలేదని తెలిపారు. ఆయనొక లెజెండ్ అని, సొంత నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఆటగాళ్ల కెరీర్ విషయంలోనూ BCCI జోక్యం చేసుకోదని సైకియా తెలిపారు.


