News March 28, 2024
ఎంపీ, పంజాబ్లో ఫిరాయింపుల పర్వం – 1/2

400 సీట్లు టార్గెట్గా పెట్టుకున్న BJP ప్రతిపక్షమైన కాంగ్రెస్కు చెక్ పెట్టేలా పావులు కదుపుతోంది. మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో కాషాయ కండువా కప్పుకునేందుకు కాంగ్రెస్ నేతలు క్యూ కడుతున్నారు. మధ్యప్రదేశ్లో ఈనెల 21 నుంచి ఇప్పటివరకు వివిధ హోదాల్లోని 16,111 మంది కాంగ్రెస్ నేతలు చేరినట్లు బీజేపీ వెల్లడించింది. వీరిలో ఓ కేంద్ర మాజీ మంత్రి, ఏడుగురు మాజీ MLAలు ఉన్నట్లు పేర్కొంది.
<<-se>>#Elections2024<<>>
Similar News
News November 3, 2025
162 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో 162 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్-సీ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిప్లొమా, ఇంటర్+ ఐటీఐ+ NAC అర్హత కలిగినవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News November 3, 2025
భారత్ విజయం.. మమతా బెనర్జీకి బీజేపీ కౌంటర్

భారత మహిళల జట్టుకు అభినందనలు తెలిపిన వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఆ రాష్ట్ర బీజేపీ కౌంటర్ ఇచ్చింది. భారత ప్లేయర్ల పోరాటం రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆమె Xలో పోస్ట్ చేశారు. దానికి ‘మీరేమో అమ్మాయిలు రా.8 గంటలకల్లా ఇంటికి చేరాలని చెప్పారు. వీళ్లేమో రా.12 గంటల వరకు ఆడుతూనే ఉన్నారు’ అంటూ BJP కౌంటర్ ట్వీట్ చేసింది. గతంలో ఓ రేప్ కేసు విషయంలో మమత చేసిన <<17986509>>వ్యాఖ్యలు<<>> వివాదం కావడం తెలిసిందే.
News November 3, 2025
ఆఫీసర్ ట్రైనీ ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

పవర్గ్రిడ్లో 20 ఆఫీసర్ ట్రైనీ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. CA/ICWA ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. రాతపరీక్ష(CBT),ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.40వేలు చెల్లిస్తారు.వెబ్సైట్: www.powergrid.in/


