News March 28, 2024

ఎంపీ, పంజాబ్‌లో ఫిరాయింపుల పర్వం – 1/2

image

400 సీట్లు టార్గెట్‌గా పెట్టుకున్న BJP ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు చెక్ పెట్టేలా పావులు కదుపుతోంది. మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో కాషాయ కండువా కప్పుకునేందుకు కాంగ్రెస్ నేతలు క్యూ కడుతున్నారు. మధ్యప్రదేశ్‌లో ఈనెల 21 నుంచి ఇప్పటివరకు వివిధ హోదాల్లోని 16,111 మంది కాంగ్రెస్ నేతలు చేరినట్లు బీజేపీ వెల్లడించింది. వీరిలో ఓ కేంద్ర మాజీ మంత్రి, ఏడుగురు మాజీ MLAలు ఉన్నట్లు పేర్కొంది.
<<-se>>#Elections2024<<>>

Similar News

News April 1, 2026

FY26లో ₹22.27 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు

image

దేశంలో మార్చి నెలకుగాను 8.8% వృద్ధితో ₹2 లక్షల కోట్ల మేర GST వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. దేశీయ విక్రయాల ద్వారా ₹1.46 లక్షల కోట్లు, దిగుమతుల రూపంలో ₹53,861 కోట్లు వచ్చినట్లు తెలిపింది. రిఫండ్ల అనంతరం నికరంగా ₹1.78 లక్షల కోట్లుగా నమోదైనట్లు పేర్కొంది. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరంలో ₹22.27 లక్షల కోట్లు వచ్చినట్లు వివరించింది. FY25(₹20 లక్షల కోట్లు)తో పోలిస్తే 8.3% వృద్ధి నమోదైనట్లు ప్రకటించింది.

News April 1, 2026

AIIMS న్యూఢిల్లీలో 10 పోస్టులు

image

తాత్కాలిక ప్రాతిపదికన 10 పోస్టుల భర్తీకి ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోస్టును బట్టి డిప్లొమా/ డిగ్రీ/MBBS/ PGతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. జీతం నెలకు రూ.18,000 – 67,000గా ఉంది. అభ్యర్థుల వయసు 25-35 మధ్య ఉండాలి. ఇంటర్వ్యూతో ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ 02.04.2026. పూర్తి వివరాలకు www.aiims.eduలో noticesలోని recruitment చూడండి.

News April 1, 2026

ఇరాన్‌పై 16వేల బాంబులు వేశాం: ఇజ్రాయెల్

image

యుద్ధం మొదలైనప్పటి నుంచి తమ వైమానిక దళం ఇరాన్‌పై 800కు పైగా విడతల్లో 16వేల బాంబులను జారవిడిచినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. 4వేల లక్ష్యాలపై 10వేలకు పైగా దాడులు చేసినట్లు తెలిపింది. మిలిటరీ హెడ్‌క్వార్టర్లు, అణుస్థావరాలు, మిస్సైల్ లాంచర్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. 2వేలకు పైగా కీలక నాయకులు, సైనికులు, కమాండర్లను హతమార్చినట్లు పేర్కొంది.