News February 24, 2025
ఫైబర్నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా

AP: ఫైబర్నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అలాగే టీడీపీకి, పార్టీ పదవులను కూడా వదులుకుంటున్నట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని ప్రకటించారు. కాగా ఫైబర్నెట్ ఎండీ, IAS దినేశ్ కుమార్ అవినీతికి పాల్పడ్డారని జీవీ రెడ్డి ఆరోపించారు. దీనిపై జీవీ రెడ్డిని సీఎం చంద్రబాబు మందలించినట్లు సమాచారం.
Similar News
News November 11, 2025
ఆపరేషన్ సిందూర్ 2.0 స్టార్ట్ అవుతుందా?

ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడుకు పాకిస్థాన్ కేంద్రంగా పని చేసే జైషే మహమ్మదే కారణమని నేషనల్ మీడియా చెబుతోంది. పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత జరిగిన మరో ఉగ్రదాడి ఇదే. దీంతో ‘భారత గడ్డపై మరోసారి దాడి జరిగితే సహించేది లేదు’ అని ప్రధాని మోదీ ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇచ్చిన హెచ్చరికలను నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. దీంతో మరోసారి భారత్ యుద్ధం చేస్తుందా? అని పలువురు పోస్టులు చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News November 11, 2025
తెలంగాణ న్యూస్

⋆ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో CID విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ.. గంటపాటు విచారించి స్టేట్మెంట్ రికార్డు చేసిన అధికారులు
⋆ HYD: ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని కాంగ్రెస్ MLAలు బీర్ల ఐలయ్య, రామచంద్రు నాయక్, రామదాసుపై మధురా నగర్ పీఎస్లో కేసు నమోదు.. BRS నేతలు వినయ్ భాస్కర్, ఆనంద్పై బోరబండ పీఎస్లో కేసు నమోదు
⋆ మరో గంటలో ముగియనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్
News November 11, 2025
అధిక పాలిచ్చే పశువును ఎలా గుర్తించాలి?(1/2

పాడి ద్వారా ఎక్కువ ఆదాయం రావాలంటే మనం కొనే పశువు ప్రతి 14 నుంచి 15 నెలలకు ఒకసారి ఈనేట్లు ఉండాలి. పాడి పశువు పాలసార గురించి తెలుసుకోవాలంటే ఆ పశువు పొదుగును గమనించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు. పొదుగు పెద్దదిగా ఉండి, శరీరంలో కలిసినట్లుగా ఉండాలి. అలాకాకుండా పొదుగు వేళ్లాడుతూ, జారిపోతున్నట్లుగా ఉండకూడదు. నాలుగు పాలసిరల (చనుమొనలు) అమరిక చతురస్రాకారంగా ఉండి, అన్నింటి నుంచి పాలు సులువుగా వస్తుండాలి.


