News March 18, 2025
భీకర దాడి.. 342 మంది మృతి

ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజాలో భారీగా <<15798213>>మరణాలు<<>> సంభవిస్తున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచి ఇప్పటివరకు 342 మంది పాలస్తీనీయులు మరణించారు. ఇందులో పిల్లలు కూడా ఉన్నారని గాజా ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, తమ దేశానికి చెందిన మిగిలిన 59 మంది బందీలను విడుదల చేయకపోతే గాజాపై దాడులు మరింత ముమ్మరం చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ హమాస్ గ్రూపును హెచ్చరించారు.
Similar News
News March 18, 2025
ఏడుగురు MLCల పదవీకాలం ముగింపు

AP: శాసనమండలిలో ఏడుగురు సభ్యుల ఆరేళ్ల పదవీకాలం ముగిసింది. యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, దువ్వారపు రామారావు, తిరుమలనాయుడు, లక్ష్మణరావు, వెంకటేశ్వరరావు, రఘువర్మ పదవీ కాలం ముగియడంతో మండలి వారికి ఘనంగా వీడ్కోలు పలికింది. అంతకముందు వీరు సీఎంతో జరిగిన ఫొటో షూట్లో పాల్గొన్నారు. అనంతరం మండలిని ఛైర్మన్ మోషేన్ రాజు రేపటికి వాయిదా వేశారు.
News March 18, 2025
విజయ్పై అన్నామలై ఫైర్.. సినిమా సెట్స్లో ఎంజాయ్ చేస్తున్నాడంటూ..

తమిళ హీరో, TVK అధినేత విజయ్పై TN BJP చీఫ్ అన్నామలై మండిపడ్డారు. ‘సినిమాల్లో డ్రింక్, స్మోక్ చేసే నీకు మద్యం కుంభకోణం గురించి మాట్లాడే అర్హత ఉందా? ఇంట్లో నుంచి రాజకీయాలు చేయడం కాదు. గ్రౌండ్ లెవెల్కి వెళ్లి ప్రజల కష్టాలు తెలుసుకోవాలి. సినిమా సెట్స్లో సిగరెట్, మద్యం తాగుతూ హీరోయిన్ల నడుము తాకుతూ రాజకీయ ప్రకటనలు చేస్తున్నాడు. నేను అతనిలా కాదు. క్షేత్ర స్థాయిలో పోరాడుతున్నా’ అని కామెంట్స్ చేశారు.
News March 18, 2025
50 ఏళ్లకే పెన్షన్పై మంత్రి కీలక ప్రకటన

AP: పెన్షనర్ల తగ్గింపు, 50 ఏళ్లకే పెన్షన్ హామీపై YCP MLCలు మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ ‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే ₹4వేల చొప్పున పెన్షన్ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. గత ప్రభుత్వం ₹వెయ్యి పెన్షన్ పెంచడానికి ఐదేళ్లు టైమ్ తీసుకుంటే మేం రాగానే ₹1,000 పెంచాం. ప్రస్తుతం అనర్హుల పెన్షన్లనే తొలగిస్తున్నాం’ అని తెలిపారు.