News September 24, 2024
భీకర యుద్ధం: 500కు చేరిన మృతుల సంఖ్య
హెజ్బొల్లా సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 500 మందికిపైగానే మృతి చెందారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు 100కుపైగా ఉన్నారు. 1,650 మందికిపైగా గాయపడ్డారు. 2006 తర్వాత లెబనాన్పై జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇదేనని విశ్లేషకులు చెబుతున్నారు. 2006లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో దాదాపు 1,300 మంది లెబనాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 5 లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారు.
Similar News
News September 24, 2024
విజయ్ పాల్కు చుక్కెదురు
AP: టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజును ఇబ్బంది పెట్టారన్న కేసులో సీఐడీ మాజీ అధికారి విజయ్ పాల్కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. కాగా సీఐడీ కస్టడీలో తనను వేధించారని RRR గుంటూరు నగరం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News September 24, 2024
ఓవర్సీస్లో ‘దేవర’ సంచలనం సృష్టించనుందా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా ఓవర్సీస్లో సంచలనం సృష్టించేలా కనిపిస్తోందని సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రీమియర్స్తో పాటు ఫస్డ్ డే కలెక్షన్లు కలిపి $5 మిలియన్లు క్రాస్ చేస్తుందని చెబుతున్నాయి. ప్రీమియర్స్ తర్వాత పాజిటివ్ టాక్ వస్తే ఇక $6M వరకు రావొచ్చని పేర్కొన్నాయి. ఏది ఏమైనా వీకెండ్ పూర్తయ్యేలోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని అంచనా వేశాయి. ‘దేవర’ చూసేందుకు మీరూ వెళ్తున్నారా?
News September 24, 2024
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలవా చంద్రబాబు: YCP
AP:తిరుమల లడ్డూ విషయంలో TTD EO, CM మాటలకు పదేపదే తేడాలేంటని YCP ప్రశ్నించింది. ‘వెజిటబుల్ ఫ్యాట్స్ గుర్తించామని జులై 23న EO చెబితే, యానిమల్ ఫ్యాట్స్ అని CM అన్నారు. ఆ తర్వాత EO యానిమల్ ఫ్యాట్స్ అన్నారు. నాణ్యత లేదని 4 ట్యాంకర్ల నెయ్యి వాడలేదని EO చెప్పారు. CM 2-3 ట్యాంకర్లు ఆలయంలోకి వెళ్లాయన్నారు. లోకేశ్ నిన్న 4 ట్యాంకర్లు వెనక్కి పంపామన్నారు. దేవుడి విషయంలో ఎందుకిన్ని డ్రామాలు?’ అని నిలదీసింది.