News October 10, 2024
రెండు మద్యం షాపులకు తీవ్ర పోటీ.. ఎక్కడంటే?

AP: మద్యం దుకాణాల లైసెన్సుల కోసం బుధవారం రాత్రి వరకు 57,709 దరఖాస్తులొచ్చాయి. రూ.2లక్షల నాన్ రిఫండబుల్ ఫీజుతో ప్రభుత్వానికి రూ.1154.18 కోట్ల ఆదాయం సమకూరింది. నేడు, రేపు కూడా అవకాశం ఉండటంతో మరో 40 వేల దరఖాస్తులు రావొచ్చని అంచనా. NTR(D) వత్సవాయి(M)లో 2 దుకాణాలకు అత్యధికంగా 217(రూ.4.2 కోట్లు) దరఖాస్తులొచ్చాయి. అత్యధికంగా NTR(D)లో 4,420, ఏలూరు(D)లో 3,843, విజయనగరం(D)లో 3,701 దరఖాస్తులు అందాయి.
Similar News
News January 16, 2026
ఠాక్రేలకు BJP టక్కర్.. పవార్లకు దక్కని పవర్

ఆసియాలోనే అత్యంత ధనిక మున్సిపల్ బాడీ అయిన BMCపై 40 ఏళ్లుగా ఉన్న ఠాక్రేల గుత్తాధిపత్యానికి BJP-షిండే కూటమి గండి కొట్టింది. విభేదాలు పక్కన పెట్టి ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు ఏకమైనా ముంబై ఓటర్లు మాత్రం మహాయుతివైపు మొగ్గు చూపారు. ఇక పవార్లకు పెట్టని కోటలైన పుణే, పింప్రి-చించ్వాడ్లోనూ ఊహించని ఫలితాలు వచ్చాయి. బాబాయ్ శరద్ పవార్, అబ్బాయ్ అజిత్ పవార్ మనస్పర్ధలు వీడి బరిలోకి దిగినా ప్యూహాలు పటాపంచలయ్యాయి.
News January 16, 2026
అంత దెబ్బతిన్నా.. పాక్ ఎందుకు కవ్విస్తోంది?

ఆపరేషన్ సిందూర్ దెబ్బకు విలవిల్లాడిన పాక్ కొన్నిరోజులుగా సరిహద్దుల్లో తరచూ డ్రోన్లతో కవ్విస్తోంది. భారత రక్షణ వ్యవస్థలో ఎక్కడైనా లోపాలున్నాయా? మన సైన్యం ఎలా స్పందిస్తోంది? అనేవి తెలుసుకోవడమే వారి లక్ష్యమని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ముఖ్యంగా ఉగ్రవాదుల చొరబాటుకు ఏమైనా దారులున్నాయా అని పాక్ చెక్ చేస్తోందని వివరించారు. అయితే ఎక్కడ డ్రోన్ కనిపించినా మన సైన్యం తూటాలతో స్వాగతం పలుకుతోంది.
News January 16, 2026
బ్యారేజీని ప్రారంభించిన సీఎం రేవంత్

TG: గోదావరి నదిపై నిర్మల్ జిల్లాలో నిర్మించిన బ్యారేజీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మామడ మం. పొన్కల్ గ్రామంలోని ఆ బ్యారేజీ గేట్లు ఓపెన్ చేసి యాసంగికి నీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అంతకుముందు ఆదిలాబాద్ జిల్లాలోని చనాక-కొరాటా పంప్ హౌస్ను సీఎం ప్రారంభించారు.


