News October 22, 2024

టీమ్‌ఇండియాలో తీవ్ర పోటీ.. అసిస్టెంట్ కోచ్ ఏమన్నారంటే?

image

భారత టెస్టు జట్టులో మిడిలార్డర్ కోసం పోటీ ఎక్కువగా ఉందని అసిస్టెంట్ కోచ్ డస్కాటే అన్నారు. ఆరు స్థానాలకు ఏడుగురు పోటీ పడుతున్నారని, పిచ్‌ను బట్టి జట్టును సెలక్ట్ చేస్తామని చెప్పారు. ‘గిల్ ఫిట్‌గా ఉన్నారు. పంత్ గాయం నుంచి కోలుకున్నారు. సర్ఫరాజ్ తొలి టెస్టులో భారీ స్కోర్ చేశారు. KL రాహుల్ మానసికంగా బలంగా ఉన్నారు. ప్లేయర్లందరికీ మా మద్దతు ఉంటుంది. జట్టు ప్రయోజనాలే మాకు ముఖ్యం’ అని మీడియాకు తెలిపారు.

Similar News

News March 18, 2025

బెట్టింగ్ యాప్స్‌పై యూట్యూబర్ పోరాటం.. కారణమిదే?

image

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్‌ఫ్లుయెన్సర్లకు సోషల్ మీడియాలో చుక్కలు చూపిస్తున్న యూట్యూబర్ అన్వేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు తన తండ్రి కూడా బెట్టింగ్ బాధితుడేనని చెప్పారు. డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశారని IPS సజ్జనార్‌తో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా పెద్ద ఎత్తున యువత మోసపోతున్నారని తెలిపారు. ఇప్పటికే అనేకమందిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

News March 18, 2025

హైడ్రా పేరుతో వసూళ్ల దందా: కేటీఆర్

image

TG: హైడ్రా పేరుతో వసూళ్ల దందా నడుస్తోందని కేటీఆర్ ట్వీట్ చేశారు. మూసీ పేరుతో పేదల ఇళ్లపై పగబట్టారని ఓ న్యూస్ ఆర్టికల్‌ను షేర్ చేశారు. ఫోర్త్ సిటీ పేరుతో సీఎం కుటుంబం రియల్ వ్యాపారం చేస్తోందని విమర్శలు చేశారు. పేదలపై ప్రతాపం చూపిస్తూ పెద్దలతో ఒప్పందం చేసుకుంటారని దుయ్యబట్టారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని పాతాళానికి తీసుకెళ్లారన్నారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలన్నారు.

News March 18, 2025

హౌతీల వల్ల నెలకు 800 మిలియన్ డాలర్ల నష్టం: ఈజిప్ట్

image

సూయజ్ కెనాల్‌లో నౌకల్ని హౌతీ రెబెల్స్ అడ్డుకుంటుండటం వల్ల తమకు నెలకు 800 మిలియన్ డాలర్ల నష్టం వస్తోందని ఈజిప్ట్ అధ్యక్షుడు సిసీ ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది 7 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. కాగా.. యెమెన్‌లోని హౌతీలపై అమెరికా ముమ్మర దాడుల్ని కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటికే 24మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. వారిలో 9మంది పౌరులున్నారని యెమెన్ ఆరోగ్యశాఖ చెబుతోంది.

error: Content is protected !!