News March 4, 2025

ఐదో రౌండ్ పూర్తి: ముందంజలో బీజేపీ అభ్యర్థి

image

TG: ఆదిలాబాద్-కరీంనగర్-నిజామాబాద్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి దూసుకెళ్తున్నారు. ఐదు రౌండ్లు ముగిసేసరికి 7,142 ఓట్ల ముందంజలో ఉన్నారు. అంజిరెడ్డికి 38,553, నరేందర్ రెడ్డి (కాంగ్రెస్) 31,411, ప్రసన్న హరికృష్ణ (బీఎస్పీ) 26,300 ఓట్లు సాధించారు.

Similar News

News January 17, 2026

‘నల్లమల సాగర్’పై కేంద్రానికి తెలంగాణ షాక్

image

TG: ‘నల్లమల సాగర్’పై AP డీపీఆర్ ప్రక్రియను నిలిపి వేయకపోతే JAN 30న ఢిల్లీలో జరిగే కమిటీ భేటీలో పాల్గొనబోమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు ఇరిగేషన్ కార్యదర్శి రాహుల్ బొజ్జా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. తమ డిమాండ్‌పై కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే కమిటీ భేటీకి తమ అధికారులు రారని తేల్చిచెప్పారు. AP అక్రమ ప్రాజెక్టులపై విజ్ఞప్తులను పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు.

News January 17, 2026

కోళ్లలో కొరైజా రోగ లక్షణాలు- జాగ్రత్తలు

image

కొరైజా రోగం సోకిన కోళ్లు సరిగా నీటిని, మేతను తీసికోక బరువు తగ్గుతాయి. కోడి ముక్కు, కళ్ల నుంచి నీరు కారుతుంది. కళ్లలో ఉబ్బి తెల్లని చీము గడ్డలు ఏర్పడతాయి. ఒకసారి ఈ వ్యాధి క్రిములు షెడ్డులోనికి ప్రవేశిస్తే అన్ని బ్యాచ్‌లకు ఈ రోగం వచ్చే ఛాన్సుంది. ఒక బ్యాచ్‌కు ఈ వ్యాధి వస్తే ఆ షెడ్డును కొన్ని రోజులు ఖాళీగా ఉంచాలి. సున్నం, గమాక్సిన్, బ్లీచింగ్ పౌడర్ కలిపి సున్నం వేయాలి. లిట్టరు పొడిగా ఉండేలా చూడాలి.

News January 17, 2026

బెంగాల్‌లో మార్పు కావాలి.. బీజేపీ రావాలి: మోదీ

image

TMC అంటే అవినీతి, హింస, బుజ్జగింపు రాజకీయాలనే విషయం బయటపడిందని PM మోదీ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ధనాన్ని దోచుకుంటోందని, కేంద్ర సాయం ప్రజలకు చేరకుండా అడ్డుకుంటోందని మండిపడ్డారు. బెంగాల్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం BJP ప్రభుత్వం రావాలన్నారు. బిహార్‌లో NDA గెలుపు తర్వాత ఇప్పుడు బెంగాల్ వంతు వచ్చిందని మాల్డా సభలో అన్నారు. ‘మార్పు కావాలి.. బీజేపీ రావాలి’ అని PM కొత్త నినాదమిచ్చారు.