News March 22, 2024
పెళ్లిలో మటన్ కోసం గొడవ.. తీవ్ర గాయాలు

TG: ఆనందంగా జరుగుతోన్న వివాహ వేడుకలో మటన్ ముక్క చిచ్చుపెట్టింది. జగిత్యాల జిల్లా ఆత్మకూరులో ఈ ఘటన జరిగింది. తమకు మటన్ కూర వేయలేదంటూ పెళ్లి కొడుకు బంధువులు వడ్డిస్తోన్న వారిపై వంట సామగ్రి, టేబుళ్లతో దాడి చేశారు. ఆగ్రహంతో పెళ్లి కూతురు బంధువులు ఎదురుదాడి చేయడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు 16 మందిపై కేసు నమోదు చేశారు.
Similar News
News April 20, 2025
అగ్నివీర్ ఎయిర్ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల

అగ్నివీర్ ఎయిర్ఫోర్స్(మ్యూజిషియన్స్) పోస్టులకు <
వెబ్సైట్:https://agnipathvayu.cdac.in/
News April 20, 2025
హసీనా అరెస్టుకు ఇంటర్పోల్ సాయం కోరిన బంగ్లా

బంగ్లాదేశ్ మాజీ పీఎం షేక్ హసీనా సహా 12 మందిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఆ దేశ పోలీసులు ఇంటర్పోల్ను కోరారు. బంగ్లా చీఫ్ అడ్వైజర్గా యూనస్ బాధ్యతలు చేపట్టాక హసీనాతో పాటు మాజీ మంత్రులు, ఆర్మీ అధికారులపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఇంటర్పోల్ రెడ్ నోటీస్ ఇస్తే ఆ వ్యక్తులు ఏ దేశంలో ఉన్నా అరెస్ట్ చేసేందుకు వీలవుతుంది. కాగా హసీనా గతేడాది AUG 5 నుంచి భారత్లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే.
News April 20, 2025
ధోనీ పరిస్థితులను తలకిందులు చేయగలడు: రోహిత్

ధోనీ సామర్థ్యం, అనుభవాన్ని రోహిత్ కొనియాడారు. ధోనీతో అంత ఈజీ కాదని చెప్పారు. ‘మహీ ఎన్నో మ్యాచులకు కెప్టెన్గా చేశారు. ఎన్నో ట్రోఫీస్ గెలిపించారు. అలాంటి వ్యక్తి ప్రత్యర్థిగా ఉంటే మనం రిలాక్స్ అవ్వకూడదు. మనం వారిపై ఆధిక్యంలో ఉన్నా.. ఒక సడెన్ మూవ్తో మనల్ని ప్రెజర్లోకి నెట్టగలడు. ధోనీ ఉంటే.. బ్యాటింగ్ అయినా, ఫీల్డింగ్ అయినా కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి’ అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించారు.