News April 14, 2024

రూ.50 కోసం గొడవ.. వేలిని కొరికేశాడు

image

ఉత్తర్‌ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. బాందా జిల్లాలో శివ చంద్ర బట్టల దుకాణానికి వెళ్లిన ఓ కస్టమర్ ఫ్రాక్ కొన్నాడు. అది సైజ్ సరిపోకపోవడంతో మరుసటి రోజు ఆ దుకాణానికి వెళ్లి కొంత పెద్ద సైజు ఇవ్వాలని అడిగాడు. దుకాణ యజమాని రూ.50 అదనంగా చెల్లించాలని కోరారు. చెల్లించబోనన్న కస్టమర్ అతడితో గొడవకు దిగి చివరికి దుకాణదారుడి ఎడమచేతి వేలిని కొరికేశాడు. తర్వాత అక్కడి నుంచి పరారవ్వగా పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News October 12, 2024

BIG ALERT: అతి భారీ వర్షాలు

image

AP: రాష్ట్రంలో ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ఎల్లుండికి వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరుసటి రోజుకు తీవ్ర తుఫానుగా మారి తమిళనాడులో తీరం దాటవచ్చని పేర్కొంది.

News October 12, 2024

ఇవాళ పాలపిట్టను ఎందుకు చూడాలంటే?

image

దసరా రోజున పాలపిట్టను చూస్తే అదృష్టం, విజయం వరిస్తుందని నమ్మకం. రావణుడిపై శ్రీరాముడు యుద్ధానికి వెళ్లే సమయంలో పాలపిట్టను చూడటంతో విజయం సాధించాడని పురాణ గాథ. పాండవులు అరణ్యవాసం ముగించుకుని ఆయుధాలు తీసుకెళ్తున్నప్పుడు పాలపిట్టను చూడటంతో కౌరవులను గెలిచారని మరోగాథ. ఈ నమ్మకంతో గ్రామాల్లో దసరా రోజున సాయంత్రం ప్రజలు పాలపిట్టను చూసేందుకు పొలాలు, ఊరి చివరకు వెళ్తారు.

News October 12, 2024

జగన్మాతగా దర్శనమిస్తున్న దుర్గమ్మ

image

AP: దసరా ఉత్సవాల్లో భాగంగా ఇవాళ విజయవాడ దుర్గమ్మ జగన్మాత రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. నేటితో ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రోత్సవాలు ముగియనున్నాయి. భక్తులను రాత్రి 11 గంటల వరకు ఆలయంలోకి అనుమతించనున్నారు. చివరి రోజు కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు.