News March 23, 2025
పరాయి పాలనపై పోరాటం.. నవ్వుతూనే ఉరికంబం!

భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్ గురు.. ఈ మూడు పేర్లు వింటేనే భారతీయుడి ఒళ్లు పౌరుషంతో పులకరిస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వ పునాదుల్ని కదిలించడంలో ఈ అమరులది మరచిపోలేని పాత్ర. 1928, డిసెంబరు 17న బ్రిటిష్ అధికారి శాండర్స్ హత్య, పార్లమెంటుపై బాంబుదాడి ఆరోపణలపై ముగ్గుర్నీ 1931, మార్చి 23న బ్రిటిషర్లు ఉరి తీశారు. ఆ అమరుల త్యాగాలకు గుర్తుగా షహీద్ దివస్ను భారత్ ఏటా మార్చి 23న జరుపుకుంటోంది.
Similar News
News November 1, 2025
కాశీబుగ్గ ఘటన.. మృతులు వీరే

AP: 1.ఏడూరి చిన్నమ్మి(50)-రామేశ్వరం(టెక్కలి), 2.రాపాక విజయ(48)-పిట్టలసరి(టెక్కలి), 3.మురిపింటి నీలమ్మ(60)-దుక్కవానిపేట-పల్లిఊరు(వజ్రపుకొత్తూరు), 4.దువ్వు రాజేశ్వరి(60)-బెలుపతియా(మందస), 5.చిన్ని యశోదమ్మ(56)-శివరాంపురం(నందిగం), 6.రూప-గుడ్డిభద్ర(మందస), 7.లోట్ల నిఖిల్(13)-బెంకిలి(సోంపేట), 8.డొక్కర అమ్ముదమ్మ-పలాస, 9.బోర బృందావతి(62)- మందస. మరో వ్యక్తి ఆస్పత్రిలో మృతిచెందగా వివరాలు తెలియాల్సి ఉంది.
News November 1, 2025
చంద్రబాబువి పిట్టలదొర మాటలు: జగన్

AP: తుఫాను నిర్వహణపై CM చంద్రబాబువి పిట్టలదొర మాటలని YCP చీఫ్ జగన్ ఎద్దేవా చేశారు. ‘వైపరీత్యాల వేళ రైతులకు శ్రీరామరక్షగా నిలిచే ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దుచేయడం బెటర్ మేనేజ్మెంట్ అవుతుందా? మొంథా తుఫాను వల్ల నష్టపోయిన బీమాలేని రైతులకు దిక్కెవరు? మీ 18నెలల కాలంలో 16సార్లు వైపరీత్యాల వల్ల రైతులు నష్టపోతే రూ.600CR ఇన్ పుట్ సబ్సిడీ బకాయి పెట్టారు. ఒక్కపైసా పంట నష్ట పరిహారం ఇవ్వలేదు’ అని ఆరోపించారు.
News November 1, 2025
ఈ కోళ్లు రోజూ గుడ్లు పెడతాయని తెలుసా?

పౌల్ట్రీ పరిశ్రమలో అధిక గుడ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి BV 380 రకం కోళ్లు. ఇవి వేడి, తేమ వాతావరణాలకు అనుకూలం. ఏడాదిలో 308 గుడ్లు పెట్టడం ఈ కోళ్ల ప్రత్యేకత. BV 380 కోడి పిల్లలను 18-20 వారాల పాటు పెంచిన తర్వాత అవి గోధుమ రంగులో పెద్ద గుడ్లను పెడతాయి. ఇవి ఏడాది పాటు గుడ్లు పెట్టి తర్వాత ఆపేస్తాయి. అప్పుడు వాటిని మాంసం కోసం విక్రయించవచ్చు. ✍️ రోజూ ఇలాంటి సమాచారానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.


