News April 5, 2024

30 లక్షల ఉద్యోగాల భర్తీ : కాంగ్రెస్

image

కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో కీలక హామీలు ఇచ్చింది. స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదనల ప్రకారం ఏటా పంటకు కనీస మద్దతు ధర ఇస్తామని పేర్కొంది. దాదాపు 30 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపింది. అంతేకాకుండా రాజస్థాన్ ప్రభుత్వం అమలు చేస్తున్న రూ.25 లక్షల క్యాష్ లెస్ ఇన్సూరెన్స్‌ను దేశవ్యాప్తంగా తీసుకొస్తామని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంది.

Similar News

News November 26, 2025

‘పిశాచి 2’లో న్యూడ్ సీన్స్‌.. స్పందించిన హీరోయిన్

image

తాను నటించిన ‘పిశాచి 2’లో న్యూడ్ సీన్స్ ఉన్నాయంటూ వచ్చిన వార్తలపై తమిళ నటి ఆండ్రియా జెరేమియా స్పందించారు. సినిమాలో బోల్డ్ సీన్లు చాలానే ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. డైరెక్టర్ అడిగితే పాత్ర కోసం ఏదైనా చేస్తానని ఆమె చెప్పారు. ఆండ్రియా పిశాచి, సైంధవ్, తడాఖా వంటి సినిమాల్లో నటించారు. పిశాచి-2 విజయ్ సేతుపతి, ఆండ్రియా లీడ్ రోల్‌లో తెరకెక్కింది. కోర్టు కేసు కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది.

News November 26, 2025

ఫ్యాన్సీ క్రేజ్.. 8888 నంబర్‌కు భారీ ధర!

image

కార్ల ఫ్యాన్సీ నంబర్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇందుకోసం కొందరు లక్షల్లో ఖర్చు పెడుతుంటారు. కానీ హరియాణాలో ఓ వ్యక్తి ఏకంగా HR88B8888 నంబర్ ప్లేట్ కోసం ఏకంగా ₹కోటి పైనే వెచ్చించాడు. ఈ నంబర్ కోసం నిర్వహించిన వేలంలో 45 అప్లికేషన్లు వచ్చాయి. బిడ్డింగ్ ధర ₹50 వేలుగా నిర్ణయించగా రికార్డు స్థాయిలో ₹1.17 కోట్లు పలికింది. దేశంలో అత్యంత ఖరీదైన రిజిస్ట్రేషన్ నంబర్‌గా నిలిచింది.

News November 26, 2025

సర్పంచ్ ఎన్నికలు.. హైకోర్టులో పిటిషన్లు

image

తెలంగాణ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై పలు గ్రామాల ప్రజలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదని అందులో పేర్కొన్నారు. వరంగల్, సంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లోని గ్రామాల్లో సర్పంచ్, వార్డు రిజర్వేషన్లను సవాల్ చేశారు. దీనిపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.