News September 24, 2024

ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ

image

AP: రాష్ట్ర ప్రభుత్వం పలు నామినేటెడ్ <>పోస్టులను <<>>భర్తీ చేసింది. ఆర్టీసీ ఛైర్మన్‌గా కొనకళ్ల నారాయణ, వక్ఫ్ బోర్డు ఛైర్మన్- అబ్దుల్ హజీజ్, శాఫ్ ఛైర్మన్‌గా రవి నాయుడు, గృహనిర్మాణ బోర్డు ఛైర్మన్‌-తాతయ్య నాయుడు, మారిటైమ్ బోర్డు ఛైర్మన్-సత్య, 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్-లంకా దినకర్, మార్క్ ఫెడ్ ఛైర్మన్-కర్రోతు బంగార్రాజు, ట్రైకార్ ఛైర్మన్-శ్రీనివాసులు, ఏపీఐఐసీ ఛైర్మన్-మంతెన రామరాజులను నియమించింది.

Similar News

News September 24, 2024

దమ్ముంటే వారిపై చర్యలు తీసుకోండి: కేటీఆర్

image

TG: హైడ్రా పేరుతో పేదల బతుకులను ప్రభుత్వం రోడ్డుపై వేస్తుందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే నిర్మాణ అనుమతులు ఇచ్చినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో అక్రమంగా అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్సే అని ఆరోపించారు. పేదల ఇళ్లు కూలిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

News September 24, 2024

మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ లక్ష్మికి ఉద్వాసన

image

AP: రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ గజ్జల వెంకట లక్ష్మికి ప్రభుత్వం ఉద్వాసన పలికింది. ఆమెను వెంటనే బాధ్యతల నుంచి తప్పిస్తూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి ఆమెకు నోటీసులు జారీ చేశారు. కాగా వెంకట లక్ష్మిని వైసీపీ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే.

News September 24, 2024

కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

image

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి నీళ్లు 99% కొవ్వు రహితం, తక్కువ మొత్తంలో షుగర్ కలిగి ఉంటాయి. జీవక్రియలను పెంచడంతో పాటు మధుమేహాన్ని నివారించడంలో సహాయపడతాయి. బరువు తగ్గేందుకు దోహదపడుతాయి. pHను బ్యాలెన్స్ చేస్తాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జీర్ణక్రియలో సహాయపడుతాయి.