News June 23, 2024
పవన్తో రేపు సినీ నిర్మాతల సమావేశం
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో రేపు మధ్యాహ్నం సినీ నిర్మాతలు విజయవాడ క్యాంప్ ఆఫీస్లో సమావేశం కానున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంగా ఎన్డీయే సర్కారుకు అభినందనలు తెలియజేయడంతో పాటు చిత్ర పరిశ్రమ సమస్యల్ని కూడా ఆయనకు వివరించనున్నట్లు తెలుస్తోంది. వీరిలో అశ్వినీదత్, చినబాబు, నవీన్, రవిశంకర్, నాగవంశీ, విశ్వప్రసాద్, బోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్య, దిల్ రాజు తదితరులున్నారు.
Similar News
News October 9, 2024
నిర్వాసితులను ఒప్పించాకే బుడమేరు ప్రక్షాళన: పవన్
AP: విజయవాడ పరిధిలో బుడమేరు ప్రక్షాళనను పద్ధతిగా చేపడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ముందుగా నిర్వాసితుల్లో అవగాహన పెంచుతామని చెప్పారు. నిర్వాసితులను ఒప్పించాకే బుడమేరు ఆక్రమణలను తొలగిస్తామని పేర్కొన్నారు. వారికి ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీనిచ్చారు.
News October 9, 2024
రాష్ట్రంలో పండుగ వాతావరణం లేదు: KTR
TG: రాష్ట్రంలో పండుగ వాతావరణం కనపడటం లేదని KTR అన్నారు. ‘ఆడబిడ్డలకు చీరలు లేవు. రైతులకు రైతుబంధు లేదు. ఆఖరికి బతుకమ్మ ఆడేందుకు డీజేలు కూడా లేవు. ఏ అధికారి తమ ఇంటికి వచ్చినా ఇల్లు కూల్చేస్తారని ప్రజలు భయపడుతున్నారు. ప్రజల సొమ్ము దోచుకునేందుకే మూసీ ప్రక్షాళన అంటున్నారు. ఎన్నికల సమయంలో రేవంత్ హామీ ఇచ్చిన ‘మహాలక్ష్మీ’ పథకం ఏమైంది? వీటిపై అందరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.
News October 9, 2024
వరద సాయం కోసం ₹601కోట్ల ఖర్చు: మంత్రి
AP: రాష్ట్రంలో వరద బాధితులకు సాయం చేయడానికి మొత్తం ₹601కోట్లు ఖర్చయిందని మంత్రి నారాయణ వెల్లడించారు. ‘ఆహారానికి ₹92.5కోట్లు, తాగునీటికి ₹11.2Cr, మెడికల్ కేర్కు ₹4.55Cr, పారిశుద్ధ్యానికి ₹22.56Cr ఖర్చయింది. ఎన్టీఆర్ జిల్లాలో ₹139.44Cr.. ఇలా మొత్తం ₹601కోట్లు ఖర్చు పెట్టాం. వరదలతో ప్రజలు తీవ్రంగా నష్టపోతే ఆదుకోకుండా ప్రభుత్వంపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు’ అని మండిపడ్డారు.