News April 10, 2024
ఎన్నికల వేళ కేరళలో సినిమా రచ్చ – 2/3

కేరళలో క్రైస్తవుల జనాభా 18% కాగా వీరిలో కాథలిక్, సిరియన్ క్రిస్టియన్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. ప్రొటెస్టెంట్లు, లాటిన్ క్రిస్టియన్లు అధికార కూటమి, కమ్యూనిస్ట్ పార్టీల సమూహమైన LDFకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మహిళల అక్రమ రవాణా, మతమార్పిడులు వంటి అంశాలతో తెరకెక్కిన ‘ది కేరళ స్టోరీ’ బీజేపీకి అనుకూలం కావొచ్చనేది విశ్లేషకుల మాట. కాగా ఈ ప్రదర్శనలతో తమకు సంబంధం లేదని BJP పేర్కొంది.
<<-se>>#Elections2024<<>>
Similar News
News November 27, 2025
రిజర్వేషన్లపై హైకోర్టులో నేడే విచారణ

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలంటూ <<18397909>>దాఖలైన<<>> పిటిషన్పై ఇవాళ HCలో విచారణ జరగనుంది. జనాభా గణాంకాలను వెల్లడించకుండా రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 46ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేశారు. దీని వల్ల బీసీల్లోని కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని, రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలని కోరారు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ వేళ దీనిపై HC ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.
News November 27, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (<
News November 27, 2025
చలికాలంలో పాదాలు పగులుతున్నాయా?

చలికాలంలో కనిపించే ప్రధాన సమస్యల్లో మడమల పగుళ్లు ఒకటి. చలి కాలంలో పొడి గాలుల కారణంగా మడమల చర్మంలో తేమ తగ్గుతుంది. ఈ కారణంగా చర్మం పొడిగా మారి పాదాలలో పగుళ్లు ఏర్పడుతాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ అప్లై చేసి సాక్సులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. డీ హైడ్రేషన్ వల్ల కూడా పాదాలు పగులుతాయి కాబట్టి తగినంత నీరు తాగాలని చెబుతున్నారు.


