News December 1, 2024

రాజ్యసభ ఉపఎన్నికలకు కూటమి అభ్యర్థుల ఖరారు?

image

AP: రాజ్యసభ ఉప ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థుల ఎంపిక పూర్తైనట్లు తెలుస్తోంది. TDP తరఫున బీద మస్తాన్ రావు, BJP తరఫున R.కృష్ణయ్య బరిలోకి దిగుతారని సమాచారం. అలాగే మరో స్థానం కోసం కంభంపాటి రామ్మోహన్ రావు, భాష్యం రామకృష్ణతోపాటు మరికొందరు ఆశావహులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా మోపిదేవి, మస్తాన్ రావు, కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో ఉపఎన్నికలు వచ్చిన సంగతి తెలిసిందే.

Similar News

News November 14, 2025

స్థానిక ఎన్నికలు BRSకు అగ్నిపరీక్షేనా!

image

TG: ‘జూబ్లీహిల్స్’ గెలుపు జోష్‌లో ఉన్న CONG అదే ఊపులో లోకల్ బాడీలనూ ఊడ్చేయాలని రెడీ అవుతోంది. త్వరలో రూరల్, అర్బన్ సంస్థల ఎలక్షన్స్ రానున్నాయి. ‘జూబ్లీ’ ఓటమితో నిరాశలో ఉన్న BRSకు ఇవి అగ్ని పరీక్షేనన్న చర్చ ఆ పార్టీలో నెలకొంది. ‘జూబ్లీ’ ప్రభావం స్థానిక ఎన్నికలపై పడుతుందని, ఈ తరుణంలో గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నాయకులు, శ్రేణుల్లో స్థైర్యాన్ని నింపడం సవాలుగా మారుతుందని భావిస్తున్నారు.

News November 14, 2025

సుపరిపాలన, అభివృద్ధి విజయమిది: మోదీ

image

బిహార్ ఎన్నికల్లో విజయంపై PM మోదీ స్పందించారు. ‘సుపరిపాలన, అభివృద్ధి, ప్రజానుకూల స్ఫూర్తి, సామాజిక న్యాయం గెలిచింది. చరిత్రాత్మక, అసమాన గెలుపుతో NDAను ఆశీర్వదించిన బిహార్ ప్రజలకు కృతజ్ఞతలు. ప్రజలకు సేవ చేసేందుకు, బిహార్ కోసం పని చేసేందుకు ఈ తీర్పు మాకు మరింత బలాన్నిచ్చింది’ అని ట్వీట్ చేశారు. తమ ట్రాక్ రికార్డు, రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలనే తమ విజన్ ఆధారంగా ప్రజలు ఓటేశారని తెలిపారు.

News November 14, 2025

ఇతిహాసాలు క్విజ్ – 66 సమాధానాలు

image

ఈరోజు ప్రశ్న: విదురుడు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించకుండా ‘మంత్రి’ పాత్రకే ఎందుకు పరిమితమయ్యారు?
జవాబు: ధృతరాష్ట్రుడు, పాండురాజు.. ఈ ఇద్దరూ అంబిక, అంబాలిక గర్భాన జన్మించారు. కానీ, విదురుడు దాసి గర్భాన జన్మించడం వలన, ఆనాటి రాజ్యాంగ నియమం ప్రకారం సింహాసనాన్ని అధిష్ఠించే అర్హతను కోల్పోయి, మంత్రి పాత్రకే పరిమితం అయ్యారు.
<<-se>>#Ithihasaluquiz<<>>