News August 8, 2025

చివరికి జడ్జి ఫోన్ కాల్స్ కూడా విన్నారు: బండి

image

TG: KCR కొడుకు తన స్వలాభం కోసం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డాడని బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘రాజకీయ నేతలు, వ్యాపారులు, అధికారులు, ఉస్మానియా ప్రొఫెసర్లతో పాటు చివరికి TGPSC పేపర్ లీకేజీ కేసును విచారిస్తున్న జడ్జి ఫోన్ కాల్స్ కూడా విన్నారు. ప్రభాకర్ రావు అనేవాడు లఫంగి. ఆయనను ఉరి తీయాలి. ఈ కేసులో ఇన్ని ఆధారాలు ఉన్నా KCR కుటుంబాన్ని రేవంత్ సర్కార్ ఎందుకు అరెస్ట్ చేయడం లేదు’ అని ప్రశ్నించారు.

Similar News

News January 19, 2026

ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు

image

AP: 2025-26 ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు 41.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి మనోహర్ వెల్లడించారు. కొనుగోలు చేసిన 24 గంటల్లోనే 94% నగదును రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇక నుంచి ఉదయం కొనుగోలు చేస్తే సాయంత్రానికే డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. మరోవైపు నేతన్నలకు మొదటి విడత త్రిఫ్ట్ ఫండ్ కింద రూ.1.67కోట్లు జమ చేసినట్లు మంత్రి సవిత వెల్లడించారు.

News January 19, 2026

నాకు పెళ్లి కాలేదు: డింపుల్ హయాతి

image

తనకు పెళ్లి అయినట్లు జరుగుతున్న ప్రచారాన్ని హీరోయిన్ డింపుల్ హయాతి ఖండించారు. ‘ఆమెకు ఆల్రెడీ పెళ్లి అయింది’ అని ఓ నెటిజన్ SMలో కామెంట్ చేయగా ‘నాకు పెళ్లి కాలేదు’ అంటూ ఆమె రిప్లై ఇచ్చారు. డింపుల్, ఆమె భర్త డేవిడ్‌పై పోలీస్ కేసు నమోదైందంటూ సదరు నెటిజన్ ఓ న్యూస్ ఆర్టికల్‌ను షేర్ చేయగా అది ఫేక్ అని ఆమె బదులిచ్చారు. కాగా డింపుల్ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ సంక్రాంతికి థియేటర్లలో విడుదలైంది.

News January 19, 2026

2030 కల్లా అప్పర్ మిడిల్ క్లాస్ దేశంగా భారత్: SBI

image

భారత్ ఆర్థికంగా జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోందని SBI తాజా రిపోర్ట్ వెల్లడించింది. 2028 కల్లా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని తెలిపింది. 2030నాటికి ‘అప్పర్ మిడిల్ ఇన్‌కమ్’ దేశాల క్లబ్‌లో చేరనుందని పేర్కొంది. అప్పటికీ మన తలసరి ఆదాయం $4,000 (దాదాపు రూ.3,63,541) మార్కును తాకడం ఖాయమని అంచనావేసింది. 2047నాటికి ‘అభివృద్ధి చెందిన దేశం’గా భారత్ గ్లోబల్ లీడర్‌గా నిలవనుందని తెలిపింది.