News February 18, 2025
అనాథాశ్రమంలో అగ్నిప్రమాదం

AP: కృష్ణా జిల్లా గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో 140 మంది విద్యార్థులు ఆశ్రమంలో ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. స్థానికులు వేగంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 1, 2026
NZB: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు… MP స్టాండ్ ఏమిటి?

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఆదివారం ప్రారంభం కానున్న నేపథ్యంలో NZB MP అర్వింద్ ధర్మపురి నిధుల గురించి ఏం మాట్లాడతారోనని పార్లమెంట్ పరిధి వాసులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ముఖ్యంగా 500 బెడ్ల ESI ఆసుపత్రి నిర్మాణం, పార్లమెంట్ పరిధిలో మూతపడిన చక్కెర ఫ్యాక్టరీల ఓపెనింగ్, నిధుల అంశాలను పార్లమెంట్ వేదికగా కేంద్రం దృష్టికి MP తీసుకెళ్తారా లేదా అన్నది వేచిచూడాల్సి ఉంది.
News February 1, 2026
NZB: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు… MP స్టాండ్ ఏమిటి?

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఆదివారం ప్రారంభం కానున్న నేపథ్యంలో NZB MP అర్వింద్ ధర్మపురి నిధుల గురించి ఏం మాట్లాడతారోనని పార్లమెంట్ పరిధి వాసులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ముఖ్యంగా 500 బెడ్ల ESI ఆసుపత్రి నిర్మాణం, పార్లమెంట్ పరిధిలో మూతపడిన చక్కెర ఫ్యాక్టరీల ఓపెనింగ్, నిధుల అంశాలను పార్లమెంట్ వేదికగా కేంద్రం దృష్టికి MP తీసుకెళ్తారా లేదా అన్నది వేచిచూడాల్సి ఉంది.
News February 1, 2026
పాతపట్నం అభివృద్ధి పనులపై కలెక్టర్, ఎమ్మెల్యే సమీక్ష

పాతపట్నంలో ఓ ప్రైవేట్ కళ్యాణ్ మండపంలో నియోజకవర్గం స్థాయి సమీక్ష సమావేశం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గోవిందరావు శనివారం నిర్వహించారు. నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం అంశాలపై శాఖల వారీగా విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణమూర్తి, అధికారులు నాయకులున్నారు.


