News February 18, 2025
అనాథాశ్రమంలో అగ్నిప్రమాదం

AP: కృష్ణా జిల్లా గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో 140 మంది విద్యార్థులు ఆశ్రమంలో ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. స్థానికులు వేగంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 1, 2026
ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచిన పాక్

ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ను పాకిస్థాన్ సొంతం చేసుకుంది. నిన్న జరిగిన రెండో టీ20లో 90 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత పాక్ 198/5 రన్స్ చేయగా ఆసీస్ 108 రన్స్కే ఆలౌటైంది. తొలి టీ20లో పాక్ 22 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. 2018 తర్వాత ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ గెలవడం పాకిస్థాన్కు ఇదే తొలిసారి. మూడో టీ20 ఇవాళ జరగనుంది.
News February 1, 2026
పాక్లో దాడులు.. 125 మంది మృతి

పాక్ అధీనంలోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో BLA రెబల్స్, ఆర్మీ మధ్య జరిగిన <<19013238>>దాడుల్లో<<>> 125 మంది చనిపోయారు. 12 ప్రాంతాల్లో BLA దాడులు చేసిందని, అందులో 18 మంది సెక్యూరిటీ సిబ్బంది, 15 మంది పౌరులు చనిపోగా పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. మరోవైపు 92 మంది మిలిటెంట్లు చనిపోయినట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భద్రతా వర్గాలు చెప్పాయి. అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదని సమాచారం.
News February 1, 2026
ప్రకృతి సేద్యంలో చీడపీడల కట్టడి ఎలా?

పర్యావరణానికి, ఆరోగ్యానికి మేలు చేసే ప్రకృతి సేద్యం చేస్తున్న రైతుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఈ విధానంలో కూడా చీడపీడల సమస్య ఉంటుంది. రసం పీల్చే పురుగులు, ఆకుముడత, కాండం, కాయతొలిచే పురుగులు, వేరు పురుగుల ఉద్ధృతి కనిపిస్తోంది. వీటిని బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, నీమాస్త్రాలతో కట్టడి చేయవచ్చు. ఈ సహజ పురుగు మందుల తయారీ విధానం, ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.


