News February 18, 2025
అనాథాశ్రమంలో అగ్నిప్రమాదం

AP: కృష్ణా జిల్లా గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో 140 మంది విద్యార్థులు ఆశ్రమంలో ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. స్థానికులు వేగంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 14, 2026
ఓటుకు రూ.70వేలు.. 200+ ఓట్ల మెజారిటీతో గెలుపు

TG: రంగారెడ్డి(D) <<19125637>>మొయినాబాద్<<>> మున్సిపాలిటీలో ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి ఓటుకు రూ.70వేలు, 25kgs బియ్యం పంచినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. నిన్న వెలువడిన ఫలితాల్లో ఆయన 200కి పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ ప్రాంతం రియల్టర్లకు గోల్డ్ మైన్గా మారడంతోనే గెలుపు కోసం రూ.7కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. స్వతంత్ర అభ్యర్థి కావడంతో ప్రధాన పార్టీల నుంచి ఆయనకు భారీ ఆఫర్ రావొచ్చనే టాక్ వినిపిస్తోంది.
News February 14, 2026
వాలంటైన్స్ డే.. ఫిబ్రవరి 14నే ఎందుకు?

రోమన్ చక్రవర్తి క్లాడియస్-II కాలంలో వివాహం చేసుకున్న పురుషుల కంటే ఒంటరిగా ఉన్నవారే యుద్ధంలో బాగా పోరాడతారని నమ్మారు. అందుకే సైనికులు పెళ్లి చేసుకోవద్దని ఆంక్షలు విధించారు. అయితే వాలంటైన్ అనే పాస్టర్ చక్రవర్తి ఆదేశాలను ధిక్కరించి రహస్యంగా ప్రేమికులకు వివాహాలు చేసేవారు. విషయం తెలిసిన చక్రవర్తి ఆయన్ను ఫిబ్రవరి 14న ఉరితీయించారు. ఆయన జ్ఞాపకార్థమే ప్రేమికుల రోజుగా జరుపుకోవడం ప్రారంభమైంది.
News February 14, 2026
అలాంటి వారు ఎక్స్అఫీషియో ఓటుకు అనర్హులు: SEC

TG: మేయర్, మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో ఓటు హక్కుపై SEC స్పష్టతనిచ్చింది. రాజ్యసభ సభ్యులు, MLCలకు స్థానిక ఓటు హక్కు తప్పనిసరి అని పేర్కొంది. మున్సిపల్ పరిధిలో ఓటరుగా నమోదు కాకపోతే ఎక్స్ అఫీషియో సభ్యులుగా అనర్హులని కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో ఇకపై లోకల్ ఓటు ఉంటేనే మేయర్/ఛైర్మన్ ఎన్నికల్లో గెలుపు ఓటములను ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రభావితం చేయగలిగే అవకాశం ఉంటుంది.


