News February 18, 2025
అనాథాశ్రమంలో అగ్నిప్రమాదం

AP: కృష్ణా జిల్లా గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో 140 మంది విద్యార్థులు ఆశ్రమంలో ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. స్థానికులు వేగంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 13, 2026
ఎరాస్మస్ బౌలింగ్ కరెక్టేనా?

T20WCలో భారత్తో జరిగిన మ్యాచ్లో నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ విచిత్రమైన బౌలింగ్పై చర్చ మొదలైంది. ఇది గల్లీ త్రో బౌలింగ్లా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. పాక్ బౌలర్ ఉస్మాన్ తారిఖ్ను అనుసరిస్తున్నారేమోనని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ICC 15 డిగ్రీల రూల్కు లోబడే అతని బౌలింగ్ ఉందని, మోచేయిని వంచడం లేదని మరికొందరు చెబుతున్నారు. ఏదిఏమైనా అతను(4W) భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు.
News February 13, 2026
వీడని AI భయాలు.. భారీ నష్టాల్లో మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. AI భయాలు ఐటీ రంగాన్ని వీడకపోవడం మొత్తం మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. సెన్సెక్స్ 823 పాయింట్లు నష్టపోయి 82,851 వద్ద, నిఫ్టీ 266 పాయింట్లు కుంగి 25,541 దగ్గర ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్-30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, HDFC బ్యాంక్, ఎయిర్టెల్ మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫీ, TCS, HCL టెక్, టెక్ మహీంద్రా, ఎటర్నల్ భారీ నష్టాల్లో ఉన్నాయి.
News February 13, 2026
SAIలో 323 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(<


