News February 18, 2025
అనాథాశ్రమంలో అగ్నిప్రమాదం

AP: కృష్ణా జిల్లా గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో 140 మంది విద్యార్థులు ఆశ్రమంలో ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. స్థానికులు వేగంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 30, 2026
కందిలో ఆకుగూడు పురుగు – నివారణకు సూచనలు

కంది పంట ఎదుగుదల దశలో ఎక్కువగా, ఒక్కోసారి పూత దశలో కూడా ఆకుగూడు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు లార్వాలు కంది మొక్కల చిగురు ఆకులను గూడుగా చేసి, లోపల ఉండి ఆకులను, పువ్వులను, లేత కాయలను కూడా తొలిచి తింటాయి. ఈ పురుగు నివారణకు లీటరు నీటిలో క్వినాల్ఫాస్ 25% ఇ.సి. 2.0 మి.లీ. (లేదా) మోనోక్రోటోఫాస్ 36% యస్.యల్ 1.6 మి.లీ. కలిపి పంటపై పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
News January 30, 2026
NCP రెండు వర్గాలు విలీనం.. FEB రెండో వారంలో ప్రకటన?

మహారాష్ట్ర Dy.CM అజిత్ పవార్ మరణంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. NCP, NCP-SP వర్గాల రీయూనియన్పై FEB రెండో వారంలో ప్రకటన రావొచ్చని సమాచారం. కొన్ని నెలలుగా అజిత్-శరద్ మధ్య దీనిపై చర్చలు జరిగాయని తెలుస్తోంది. NCP విలీనమై మహాయుతిలోనే కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్రస్థాయిలో సునేత్రా/ప్రఫుల్, జాతీయ స్థాయిలో శరద్ పార్టీని లీడ్ చేస్తారని టాక్. ఇదే జరిగితే మహా వికాస్ అఘాడీకి షాక్ తప్పదు.
News January 30, 2026
NCP రెండు వర్గాల విలీనం.. ఏకాకిగా కాంగ్రెస్?

మహారాష్ట్రలో NCP వర్గాల విలీనంతో INC ఏకాకిగా మిగిలే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహా వికాస్ అఘాడీకి శివసేన(ఉద్ధవ్) దూరంగా ఉంటోంది. తాజాగా స్థానిక ఎన్నికల్లో దాయాది రాజ్ ఠాక్రే(MNS)తో చేతులు కలిపింది. అటు NCP వర్గాలూ కలిసి మహాయుతివైపే మొగ్గు చూపొచ్చని తెలుస్తోంది. శరద్ పవార్కు కేంద్ర పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఇదేమీ సమస్య కాకపోవచ్చు. ఇదే జరిగితే MVA కకావికలమై INCకి ఎదురుదెబ్బ తప్పదు.


