News February 18, 2025
అనాథాశ్రమంలో అగ్నిప్రమాదం

AP: కృష్ణా జిల్లా గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో 140 మంది విద్యార్థులు ఆశ్రమంలో ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. స్థానికులు వేగంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 12, 2026
కాంగ్రెస్ సన్నిహిత BRS MLAలు ఇప్పుడేం చేస్తారో

TG: మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో ఈనెల 16న ఛైర్మన్, మేయర్ల ఎన్నిక జరగనుంది. ఎక్స్అఫీషియో మెంబర్లుగా MP, MLA, MLCలు ఓటేయొచ్చు. పార్టీల విప్ వీరికీ వర్తిస్తుంది. దాన్ని ఉల్లంఘిస్తే సభ్యత్వం కోల్పోతారని SEC స్పష్టం చేసింది. ఈ తరుణంలో INC సన్నిహిత BRS MLAలు ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారుతోంది. పోటాపోటీ ఉన్న చోట్ల వీరి ఓటు కీలకం కానుంది. వీరి అనర్హతపై SC విచారణ నేపథ్యంలో విప్కే కట్టుబడతారంటున్నారు.
News February 12, 2026
హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో 220 పోస్టులు

చెన్నై ఆవడిలోని హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 220 జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హతతో పాటు పనిఅనుభవం వారు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. బేసిక్ పే 21,000+IDA చెల్లిస్తారు. సైట్: avnl.co.in
News February 12, 2026
అరటిలో తొండం కుళ్లు తెగులు – నివారణ

సూర్యరశ్మి తాకిడికి అరటి గెల తొండంపై ఎండుమచ్చలు ఏర్పడి క్రమేపి అక్కడ కుళ్లు ఏర్పడుతుంది. గెలబరువు పెరిగినపుడు కుళ్లిన తొండం విరిగి గెలపడిపోతుంది. ఒక్కొక్కసారి గెలలో కాయలు సరిగా తయారుకావు. ఈ సమస్య నివారణకు తొండంపై అరటి ఆకులు చుట్టినట్లయితే వాటిపై ఎండు మచ్చలు ఏర్పడవు. మచ్చలు ఏర్పడిన తొండం పూర్తిగా తడిసేలా లీటరు నీటికి కార్బండిజమ్ 1గ్రా. కలిపి పిచికారీ చేయాలి.


