News February 28, 2025
త్రివేణీ సంగమం వద్ద అగ్నిప్రమాదం

మహా కుంభమేళా జరిగిన ప్రాంతంలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఇందులో ఓ వ్యక్తి గాయపడగా అతడిని ఆసుపత్రికి తరలించారు. త్రివేణీ సంగమం వద్ద ఉన్న శాస్త్రి బ్రిడ్జి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా మహా కుంభమేళా జరిగిన రోజుల్లోనూ పలుమార్లు అగ్నిప్రమాదాలు సంభవించాయి. బుధవారంతో కుంభమేళా ముగిసింది.
Similar News
News January 6, 2026
శ్రీవాణి దర్శన టికెట్లు ఇక ఆన్లైన్లోనే

తిరుమలలో శ్రీవాణి దర్శన టికెట్లను ఆఫ్లైన్లో జారీ చేయడాన్ని TTD నిలిపేసింది. ఈ నెల 9 నుంచి రోజూ ఆన్లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో 800 టికెట్లను కేటాయించనుంది. ఉ.9 గంటలకు విడుదల చేయనుంది. టికెట్ పొందిన భక్తులు అదే రోజు సా.4 గంటలకు దర్శనానికి రిపోర్ట్ చేయాలి. ఈ విధానాన్ని నెల రోజులు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఒక కుటుంబానికి నలుగురు(1+3) సభ్యులకే టికెట్ బుకింగ్కు అనుమతి ఉంటుంది.
News January 6, 2026
అమెరికాలో పుట్టి.. HYDకు ఆడుతున్నాడు

VHTలో డబుల్ సెంచరీ బాదిన <<18778738>>అమన్ <<>>రావు అమెరికాలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కరీంనగర్కు చెందినవారు కాగా ఉద్యోగ నిమిత్తం USకు వెళ్లారు. HYDలో పెరిగిన అమన్ క్రికెట్పై మక్కువ పెంచుకొని దేశవాళీలో సత్తా చాటుతున్నారు. VHTలో హైదరాబాద్ తరఫున డబుల్ సెంచరీ బాదిన తొలి, ఓవరాల్గా తొమ్మిదో ప్లేయర్. ఆయనకు మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. IPL-2026 మినీ వేలంలో అమన్ను RR ₹30Lakhsకు కొనుగోలు చేసింది.
News January 6, 2026
డబ్బులివ్వకుంటే సిబ్బందికి జీతాలెలా: KRMB

AP, TG ప్రభుత్వాల తీరుపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు (KRMB) అసంతృప్తి వ్యక్తం చేసింది. గత 3 త్రైమాసికాలుగా బోర్డుకు నిధులు విడుదల చేయకపోవడంపై ఆగ్రహించింది. FY25-26లో ఎలాంటి నిధులూ ఇవ్వకపోవడంపై 2 రాష్ట్రాల ఇరిగేషన్ ENCలకు లేఖ రాసింది. సిబ్బందికి జీతాలు చెల్లించడంలో ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొంది. కాగా టెలిమెట్రీ ఫేజ్2 కోసం TG అందించిన రూ.4.15CRను మళ్లించి సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నారు.


