News February 6, 2025
బంగ్లా పితామహుడి ఇంటికి నిప్పు

బంగ్లాదేశ్ పితామహుడిగా పేరొందిన షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటిని బంగ్లా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టారు. దేశంలోని తమ అవామీ లీగ్ కార్యకర్తలందరూ ఏకమై మహ్మద్ యూనస్ మధ్యంతర సర్కారుపై తిరగబడాలని మాజీ ప్రధాని హసీనా ఆన్లైన్ వీడియోలో పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆమె తండ్రి, బంగబంధు రెహమాన్ భవనాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు.
Similar News
News December 10, 2025
వణుకుతున్న కర్నూలు, నంద్యాల జిల్లా ప్రజలు

ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలను చలి వణికిస్తోంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 15-16 డిగ్రీలకు పడిపోయాయి. ఉదయం 9 గంటలైనా చలి తగ్గడం లేదు. దీనికి తోడు మంచు కూడా కురుస్తోంది. ఈనెల 11 నుంచి చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల వరకు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 16-17 డిగ్రీల వరకు నమోదవుతాయని తెలిపారు. చలిని తట్టుకోలేక చలిమంటలు వేసుకుంటున్నారు.
News December 10, 2025
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీలో ఉద్యోగాలు

<
News December 10, 2025
నానో ఎరువులను ఎలా వాడాలి?

నానో యూరియా, DAPలను పైరుపై పిచికారీ పద్ధతిలోనే వాడాలి. వీటిని భూమిలో, డ్రిప్లలో వాడకూడదు. పంటలకు దుక్కిలో వ్యవసాయ నిపుణులు సిఫార్సు చేసిన ఎరువులను యథావిధిగా వేయాలి. పంటకు పైన ఎరువులను సిఫార్సు చేసినప్పుడు మాత్రం.. నానో ఎరువుల రూపంలో పిచికారీ చేసుకోవాలి. నానో యూరియా, DAPలను ఎకరాకు అర లీటరు(లీటరు నీటికి 4ml)చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత సంప్రదాయ యూరియా, DAPలను పంటకు వేయనవసరం లేదు.


