News October 21, 2025

బాణసంచా కార్మికులకు బీమా ఉండాల్సిందే: CM

image

AP: కోనసీమ (D) రాయవరంలో బాణసంచా <<17957968>>పేలుడు<<>> ఘటనలో మృతులకు ₹15 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని CBN ఆదేశించారు. ఒకే షెడ్డులో 14 మంది మాన్యుఫ్యాక్చరింగ్ చేశారని, హార్డ్ మెటీరియల్ వాడడంతో స్పార్క్ వచ్చి ప్రమాదం జరిగిందని అధికారులు నివేదించారు. బాణసంచా తయారీదారులు నిబంధనలు పాటించకుంటే PD కేసులు పెట్టాలని CM ఆదేశించారు. కార్మికులకు వ్యక్తిగత బీమా ఉండాలన్నారు.

Similar News

News October 22, 2025

డీఏ జీవోలో మార్పులు

image

AP: రిటైర్మెంట్ సమయంలో డీఏ బకాయిలు కలిపేలా నిన్న ఇచ్చిన జీవోలో ప్రభుత్వం మార్పులు చేసింది. డీఏ బకాయిల్లో 10 శాతాన్ని ఏప్రిల్‌లో చెల్లించాలని, మిగిలిన 90% బకాయిలు తదుపరి 3 వాయిదాల్లో (2026 ఆగస్టు, నవంబర్, 2027 ఫిబ్రవరి) చెల్లించాలని సవరణ జీవో రిలీజ్ చేసింది. OPS ఉద్యోగుల పెండింగ్ డీఏలను GPF ఖాతాకు జమ చేయాలని, CPS, PTD ఉద్యోగులకు 90% బకాయిలు నగదుగా ఇవ్వాలని నిర్ణయించింది.

News October 22, 2025

అర్ధరాత్రి వరకు నిద్ర పోవడం లేదా?

image

సరైన నిద్ర లేకుంటే శరీరం అధిక కేలరీల ఆహారం కోరుకుంటుందని, దీంతో బరువు పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే రక్తపోటు, గుండె సంబంధ వ్యాధులు, టైప్-2 డయాబెటిస్ రావొచ్చు. ఏకాగ్రత దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఉదయం నిద్ర లేచాక నీరసంగా అనిపించి రోజంతా చురుకుగా ఉండలేరు. కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. వృద్ధాప్య లక్షణాలు త్వరగా కనిపిస్తాయి.
Share it

News October 21, 2025

ఇండియాపై పాక్ ఆరోపణలు.. దీటుగా బదులిచ్చిన అఫ్గాన్

image

ఇటీవల జరిగిన సరిహద్దు ఘర్షణల్లో ఇండియా హస్తం ఉందంటూ పాక్ చేసిన ఆరోపణలపై అఫ్గాన్ దీటుగా స్పందించింది. అవి నిరాధార, ఆమోదయోగ్యంకాని ఆరోపణలని మండిపడింది. ఓ స్వతంత్ర దేశంగా భారత్‌తో బంధం కొనసాగిస్తామని అఫ్గాన్ రక్షణ మంత్రి మహ్మద్ యాకూబ్ స్పష్టంచేశారు. ఇతర దేశాలకు వ్యతిరేకంగా తమ భూభాగాలను వాడుకునేందుకు ఎన్నటికీ అనుమతివ్వబోమని చెప్పారు. పాక్‌తో మంచి సంబంధాలు కోరుకుంటున్నామని అన్నారు.