News November 30, 2024

అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి

image

అమెరికాలో తుపాకీ తూటాలకు మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. చికాగో వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లా రాపర్తినగర్‌కు చెందిన నూకరపు సాయితేజ (26)చనిపోయాడు. సాయితేజ MS చదవడానికి 4 నెలల క్రితమే US వెళ్లాడు. అతడు షాపింగ్ మాల్‌లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తుండగా దొంగతనానికి వచ్చిన దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

Similar News

News December 3, 2025

ASF: డిసెంబర్ 21న జాతీయ లోక్ అదాలత్

image

డిసెంబర్ 21న జాతీయ లోక్ అదాలత్‌లో అధిక కేసులు పరిష్కారానికి జిల్లాలోని అన్ని కోర్టుల కృషి చేయాలని ASF జిల్లా న్యాయమూర్తి రమేష్ తెలిపారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా పోలీస్, అటవీశాఖ, ఎక్సైజ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ లోక్ అదాలత్ పై అందరికీ అవగాహన కల్పించాలని కోరారు. కక్షిదారులు సద్వినియోగం చేసుకొని తమ కేసులని పరిష్కరించుకొని శాంతియుతంగా జీవనం సాగించాలన్నారు.

News December 3, 2025

ASF: డిసెంబర్ 21న జాతీయ లోక్ అదాలత్

image

డిసెంబర్ 21న జాతీయ లోక్ అదాలత్‌లో అధిక కేసులు పరిష్కారానికి జిల్లాలోని అన్ని కోర్టుల కృషి చేయాలని ASF జిల్లా న్యాయమూర్తి రమేష్ తెలిపారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా పోలీస్, అటవీశాఖ, ఎక్సైజ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ లోక్ అదాలత్ పై అందరికీ అవగాహన కల్పించాలని కోరారు. కక్షిదారులు సద్వినియోగం చేసుకొని తమ కేసులని పరిష్కరించుకొని శాంతియుతంగా జీవనం సాగించాలన్నారు.

News December 3, 2025

కాణిపాకం సేవలు ఇక ఆన్ లైన్ లోనూ…

image

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ సేవలు ఆన్ లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. దర్శన టికెట్ల బుకింగ్, ఆర్జిత సేవలు, వసతి, ప్రసాదాలను భక్తులు ఆన్ లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఆన్ లైన్ సేవలకు దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. బుకింగ్ కోసం ఆలయ అధికార వెబ్‌సైట్ల ద్వారా సేవలు పొందవచ్చు. లేదా ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ 9552300009 ద్వారా కూడా ఈ సేవలు పొందవచ్చు.