News March 6, 2025
తొలి 5 సెంచరీలు ఐసీసీ టోర్నీల్లోనే.. రచిన్ రికార్డ్

న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర వన్డేల్లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. తన తొలి 5 సెంచరీలనూ ఐసీసీ టోర్నీల్లోనే చేసిన తొలి ఆటగాడిగా నిలిచారు. 2023 వరల్డ్ కప్లో ఇంగ్లండ్పై 123*, ఆసీస్పై 116, పాక్పై 108, CT-2025లో బంగ్లాపై 112, నిన్న సౌతాఫ్రికాపై 108 రన్స్ బాదారు. కాగా ఇప్పటివరకు 32 వన్డేలు ఆడిన రచిన్ 44.29 యావరేజ్, 108.72 స్ట్రైక్ రేటుతో 1,196 పరుగులు చేశారు.
Similar News
News January 25, 2026
కేంద్ర బడ్జెట్: సంప్రదాయాలు, చరిత్ర విశేషాలు

స్వాతంత్ర్యం తర్వాత తొలి బడ్జెట్ను 1947లో RK షణ్ముఖం చెట్టి ప్రవేశపెట్టారు. 2017 నుంచి Feb 1న సమర్పిస్తున్నారు. ఒకప్పుడు సా.5 గంటలకు ప్రవేశపెట్టే విధానం, 1999 నుంచి ఉ.11కు అమల్లోకి వచ్చింది. బడ్జెట్ ప్రింటింగ్ ప్రారంభానికి సూచికగా హల్వా కార్యక్రమం, అనంతరం ‘లాక్-ఇన్’ పీరియడ్ స్టార్టవుతుంది. అంటే అధికారులకు బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. 2019 నుంచి బ్రీఫ్కేస్ స్థానంలో ఎర్రటి సంచిని ప్రవేశపెట్టారు.
News January 25, 2026
రూట్ సరికొత్త రికార్డు

అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్(POTM)లు నెగ్గిన ఇంగ్లండ్ ప్లేయర్గా జో రూట్ నిలిచారు. ఇవాళ శ్రీలంకతో మ్యాచులో అవార్డు అందుకోవడంతో ఈ రికార్డు చేరుకున్నారు. రూట్ 27 POTMలు అందుకోగా పీటర్సన్(26), బట్లర్(24), బెయిర్ స్టో(22), స్టోక్స్(21) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కాగా ఓవరాల్గా అత్యధిక POTMలు అందుకున్న జాబితాలో సచిన్(76), కోహ్లీ(71), జయసూర్య(58) ముందు వరుసలో ఉన్నారు.
News January 25, 2026
16 రోజుల డిజిటల్ అరెస్ట్.. రూ.14 కోట్లు స్వాహా

డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ NRI దంపతుల నుంచి ఏకంగా రూ.14.84 కోట్లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. తాము CBI, పోలీసులమని చెప్పి నకిలీ అరెస్ట్ వారెంట్ చూపించి ఢిల్లీలో నివసిస్తున్న 77 ఏళ్ల మహిళ, ఆమె భర్తను 16 రోజుల పాటు వీడియో కాల్లో నిరంతరం నిఘా పెట్టారు. భయంతో బాధితులు తమ పెట్టుబడుల నుంచి డబ్బును వారికి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ కేసులో GJ, UP, ఒడిశా రాష్ట్రాల్లో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.


