News October 1, 2024
HYD నుంచి సైన్యానికి చేరిన మొదటి స్వదేశీ సబ్మెషీన్ గన్స్

ASMI పేరుతో భారత్లో డెవలప్ చేసిన మొదటి సబ్మెషీన్ గన్స్ సైన్యం చేతికి అందాయి. వీటి డిజైన్, డెవలప్మెంట్, తయారీకి మూడేళ్ల కన్నా తక్కువ సమయమే పట్టింది. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఇజ్రాయెల్ Uzi, జర్మనీ MP5 కన్నా ఇవెంతో మెరుగ్గా పనిచేస్తాయి. పైగా వాటితో పోలిస్తే 10-15% బరువు, 30% ధర తక్కువ. రూ.లక్ష లోపే లభిస్తాయి. హైదరాబాద్ కంపెనీ లోకేశ్ మెషీన్స్ 550 ASMITA గన్స్ను ఆర్మీకి డెలివరీ చేసింది.
Similar News
News November 16, 2025
భారీ జీతంతో CSIR-SERCలో ఉద్యోగాలు

CSIR-స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్ (SERC) 30 సైంటిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 21 నుంచి డిసెంబర్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32 ఏళ్లు. ఎంపికైన వారికి నెలకు రూ.1,38,652 చెల్లిస్తారు. వెబ్సైట్: https://serc.res.in/
News November 16, 2025
మేం కాంగ్రెస్కు కాదు.. నవీన్కు సపోర్టు చేశాం: అసదుద్దీన్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో వ్యక్తిగతంగా నవీన్ యాదవ్కు సపోర్టు చేశామని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. కానీ కాంగ్రెస్కు మద్దతిచ్చినట్లుగా కొందరు అర్థం చేసుకున్నారన్నారు. నియోజకవర్గాన్ని నవీన్ అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్తో తమకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. కేసీఆర్ అయినా, తానైనా మా పార్టీలకు మంచి అనిపించేది చేసుకుంటూ వెళ్తామని చెప్పారు.
News November 16, 2025
19న అకౌంట్లలోకి రూ.7,000?

AP: PM కిసాన్ పథకంలో భాగంగా ఈ నెల 19న రైతుల ఖాతాల్లో కేంద్రం రూ.2వేల చొప్పున జమ చేయనుంది. అదే రోజు రాష్ట్రంలో ‘అన్నదాత సుఖీభవ’ రెండో విడత నిధులను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రూ.5వేల చొప్పున అన్నదాతల అకౌంట్లలో జమ చేయనుందని సమాచారం. PM కిసాన్తోపాటు ‘సుఖీభవ’ స్కీమ్నూ అమలు చేస్తామని సీఎం చంద్రబాబు పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. అన్నట్లుగానే AUGలో తొలి విడత నిధులను రిలీజ్ చేశారు.


