News April 3, 2025

‘అమరావతి’కి తొలి విడత రుణం.. ఖాతాలో రూ.3,535 కోట్లు జమ

image

AP: రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు తొలి విడతలో రూ.3,535 కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ నిధులు ఇవాళ ప్రభుత్వ ఖాతాలో జమయ్యాయి. త్వరలోనే ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు(ADB) నుంచీ తొలి విడత రుణం మంజూరవుతుందని ప్రభుత్వ పెద్దలు తెలిపారు. రాజధాని కోసం ప్రపంచ బ్యాంకు, ADB రూ.6,700 కోట్లు చొప్పున రుణం ఇస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా రూ.1,400 కోట్లు ప్రత్యేక సాయంగా అందిస్తోంది.

Similar News

News November 25, 2025

రూ.10 కోట్లు చెల్లించాలని విశాల్‌కు హైకోర్టు ఆదేశం

image

హీరో విశాల్‌ను రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. అగ్రిమెంట్‌ ఉల్లంఘించి తన సినిమాలను లైకా ప్రొడక్షన్స్‌కు కాకుండా వేరే సంస్థకు విక్రయించినట్టు పిటిషన్ దాఖలైంది. విచారణ జరిపిన కోర్టు రూ.21 కోట్లు 30% వడ్డీతో లైకాకు చెల్లించాలని తీర్పునిచ్చింది. విశాల్ దానిని సవాల్ చేస్తూ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ద్విసభ్య ధర్మాసనం విచారించింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది.

News November 25, 2025

రూ.10 కోట్లు చెల్లించాలని విశాల్‌కు హైకోర్టు ఆదేశం

image

హీరో విశాల్‌ను రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. అగ్రిమెంట్‌ ఉల్లంఘించి తన సినిమాలను లైకా ప్రొడక్షన్స్‌కు కాకుండా వేరే సంస్థకు విక్రయించినట్టు పిటిషన్ దాఖలైంది. విచారణ జరిపిన కోర్టు రూ.21 కోట్లు 30% వడ్డీతో లైకాకు చెల్లించాలని తీర్పునిచ్చింది. విశాల్ దానిని సవాల్ చేస్తూ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ద్విసభ్య ధర్మాసనం విచారించింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది.

News November 25, 2025

APలో రెండు కొత్త జిల్లాలు, 4 రెవెన్యూ డివిజన్లు!

image

రాష్ట్రంలో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. మార్కాపురం, మదనపల్లెను జిల్లాలుగా ఏర్పాటు చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ CM CBNకు నివేదిక అందించింది. కొత్త జిల్లాల్లో 21 చొప్పున మండలాలు ఉండనున్నాయి. అటు అద్దంకి, నక్కపల్లి, పీలేరు, మడకశిరలను కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేయనున్నారు. CM ఆమోదం తెలిపాక ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్ జారీ అవుతుంది. అభ్యంతరాలు, సూచనలకు నెల గడువు ఉంటుంది.