News September 13, 2025
యుద్ధం తర్వాత తొలి మ్యాచ్.. స్టేడియం హౌస్ఫుల్: అక్తర్

ఆసియా కప్లో రేపు భారత్తో జరగనున్న మ్యాచ్కు టికెట్స్ సేల్ అవ్వట్లేదన్న వార్తలపై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందించారు. ‘భావోద్వేగాలు ఉప్పొంగుతున్నాయి. యుద్ధం తర్వాత భారత్తో పాక్ తొలిసారి తలపడుతోంది. కచ్చితంగా స్టేడియం హౌస్ఫుల్ అవుతుంది. టికెట్లు అమ్ముడవ్వట్లేదని నాతో ఒకరన్నారు. అది వాస్తవం కాదని, అన్నీ సేల్ అయ్యాయని చెప్పాను. ఇదంతా బయట జరుగుతున్న ప్రచారం మాత్రమే’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News March 4, 2026
నేడే మొదటి సెమీఫైనల్.. ఫైనల్ బెర్త్ ఎవరిదో?

T20WC: ఈడెన్ గార్డెన్స్ వేదికగా నేడు సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. 2024లో ఫైనల్ చేరి భారత్ చేతిలో ఓడిపోయిన ప్రోటీస్ ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే కసితో రాణిస్తోంది. మరోవైపు నెట్ రన్రేట్ కలిసొచ్చి సెమీస్కు వచ్చిన కివీస్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. T20I హెడ్ టు హెడ్ రికార్డ్లో 12 విజయాలతో సఫారీలదే పైచేయి. కాగా రాత్రి 7.00కు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
News March 4, 2026
అంగన్వాడీల నిరసన.. ప్రభుత్వంపై జగన్ విమర్శలు

AP: హామీల కోసం పోరాడుతున్న అంగన్వాడీలు, హెల్పర్ల పట్ల ప్రభుత్వ వైఖరి అత్యంత హేయమైనదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. మహిళలపై లాఠీఛార్జీ చేసి నిర్బంధించడమే కాక ఆహారం, తాగునీళ్లు అందకుండా చేశారని ఆరోపించారు. ఏరుదాటాక తెప్పతగలేసే మీ ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. విజయవాడ ధర్నాలో పలువురు అంగన్వాడీల అరెస్ట్పై నిన్న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన జరిగిన నేపథ్యంలో జగన్ ట్వీట్ చేశారు.
News March 4, 2026
నెతన్యాహు సైనికుడిగా ఉన్నప్పుడు..

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గతంలో ఆ దేశ సైన్యంలో పని చేశారు. 1967 నుంచి 1973 వరకు ఆరేళ్ల పాటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF)లో సేవలు అందించారు. IDFలో టాప్ సీక్రెట్ స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహించే ‘Sayeret Matkal’ అనే యూనిట్లో పని చేశారు. 1972లో సబేనా ప్లేన్ బందీల రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. 1973లో కెప్టెన్ ర్యాంక్ సాధించారు. 1996లో ఇజ్రాయెల్ ప్రధానిగా గెలిచి, పిన్నవయసు PMగా ఘనత సాధించారు.


