News August 17, 2024
వక్ఫ్ సవరణ బిల్లుపై 22న JPC తొలి భేటీ

వక్ఫ్ సవరణ బిల్లు-2024పై అధ్యయనానికి ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ సంఘం ఈ నెల 22న తొలిసారి భేటీ కానుంది. ఢిల్లీలో జరిగే ఈ సమావేశంలో కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ, న్యాయశాఖ ప్రతినిధులు బిల్లు వివరాలను సభ్యులకు వివరించనున్నారు. బీజేపీ సీనియర్ నేత ఎంపీ జగదంబికాపాల్ ఈ JPCకి ఛైర్మన్గా ఉన్నారు. ఈ బిల్లుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం చెప్పడంతో కేంద్రం JPCని నియమించింది.
Similar News
News November 26, 2025
తుఫాను ముప్పు తప్పింది.. అల్పపీడనం దూసుకొస్తోంది

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన సెన్యార్ తుఫాను ఇండోనేషియా వైపు పయనిస్తోంది. దీంతో రాష్ట్రానికి తుఫాను ముప్పు తప్పిందని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపారు. ఇది క్రమంగా వాయుగుండంగా బలపడి ఈ నెల 29న తమిళనాడు వద్ద తీరం దాటుతుందని అంచనా వేశారు. దీని ప్రభావంతో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
News November 26, 2025
హనుమాన్ చాలీసా భావం – 21

రామ దువారే తుమ రఖవారే |
హోత న ఆజ్ఞా బిను పైఠారే ||
శ్రీరాముని సన్నిధికి ఆంజనేయస్వామి ద్వారపాలకుడిగా ఉంటాడు. ఆయన అనుమతి లేకుండా శ్రీరాముని చెంతకు ఎవరూ చేరలేరు. ఆ శ్రీరాముడు మనల్ని చల్లగా చూడాలంటే హనుమంతుడి అనుగ్రహం కూడా తప్పనిసరి. రామయ్యకు అత్యంత ప్రీతిపాత్రుడైన, శక్తిమంతుడైన భక్తుడు హనుమంతుని పూజిస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది. త్వరగా మోక్షం లభిస్తుంది. <<-se>>#HANUMANCHALISA<<>>
News November 26, 2025
బిడ్డకు జన్మనిచ్చిన ‘బ్లూడ్రమ్’ ముస్కాన్.. DNA టెస్టుకు డిమాండ్

UP మీరట్లో ప్రియుడితో కలిసి భర్తను చంపి బ్లూడ్రమ్లో పాతేసిన <<16560833>>ముస్కాన్<<>> తాజాగా ఆడపిల్లకు జన్మనిచ్చింది. భర్త సౌరభ్ పుట్టినరోజునే(NOV 24) బిడ్డ పుట్టడం గమనార్హం. దీంతో ఆ చిన్నారికి DNA టెస్టు నిర్వహించాలంటూ మృతుడి సోదరుడు రాహుల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పెద్ద కూతురు విషయంలోనూ అతను పిల్ వేయగా తీర్పు వెలువడలేదు. వారిద్దరూ సౌరభ్ పిల్లలుగా తేలితే తామే పోషిస్తామని అతను చెబుతున్నాడు.


