News April 13, 2024
తొలిదశ ఎలక్షన్స్.. ధనిక అభ్యర్థి ఎవరంటే!

ఈ నెల 19న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ జరగనుంది. ఈ ఫేజ్లో పోటీ చేసే అభ్యర్థుల్లో నకుల్నాథ్(INC) రూ.717 కోట్ల ఆస్తులతో ధనిక అభ్యర్థిగా నిలిచినట్లు ADR నివేదిక తెలిపింది. ఈయన మధ్యప్రదేశ్ Ex CM కమల్నాథ్ కుమారుడు. ఆ తర్వాత TNలోని AIADMK అభ్యర్థి అశోక్(రూ.662 కోట్లు), BJP నేత దేవనాథన్ (రూ.304 కోట్లు) నిలిచారు. పుదుచ్చేరిలో ఇండిపెండెంట్ అభ్యర్థి సతీశ్(25) రూ.2000 కలిగి ఉన్నట్లు ప్రకటించారు.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News March 28, 2026
మీది ప్రేమేనా? ఓసారి చెక్ చేసుకోండి!

మనం ఒకరిని ఇష్టపడేటప్పుడు అది ప్రేమా లేక ‘లిమరెన్స్’ అనే భ్రమలో ఉన్నామా? అని గుర్తించడం ముఖ్యం. లిమరెన్స్ అనేది ఓ రకమైన ‘ఎమోషనల్ అడిక్షన్’. ఈ స్థితిలో ఉన్నవారు అవతలి వ్యక్తి గురించి అతిగా ఊహించుకోవడం, వారి కోసం పరితపించడం చేస్తారు. వారిని కోల్పోతామేమో అనే అభద్రతాభావం మానసికంగా వేధిస్తుంది. నిజమైన ప్రేమలో నమ్మకం, గౌరవం ఉంటుంది. కానీ లిమరెన్స్ మిమ్మల్ని ఆ వ్యక్తిపై పిచ్చిగా ఆధారపడేలా చేస్తుంది.
News March 28, 2026
అఖిల్ ‘లెనిన్’ రిలీజ్ వాయిదా

అఖిల్ అక్కినేని హీరోగా మురళీ కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లెనిన్’ చిత్రం విడుదల పోస్ట్పోన్ అయింది. మే 1వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా జూన్ 26న థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ ప్రకటించారు. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. హీరోయిన్గా భాగ్యశ్రీబోర్సే నటించగా తమన్ మ్యూజిక్ అందించారు.
News March 28, 2026
రాజధానికి పార్లమెంట్ ఆమోదం తర్వాత రాష్ట్రంలో వేడుకలు: CM CBN

AP: రాజధాని అమరావతికి పార్లమెంట్ ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతి నాది అనే భావనను ప్రజల్లో నింపేలా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. రాజధాని చట్ట సవరణకు కేంద్ర క్యాబినెట్ ఏప్రిల్ 1న ఆమోదం తెలిపే అవకాశం ఉందని మీడియా చిట్చాట్లో వెల్లడించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదం వచ్చేలా కేంద్రానికి తీర్మానం పంపినట్లు పేర్కొన్నారు.


