News July 25, 2024
FIRST PHOTO: అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా KCR

TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన సభలో పాల్గొన్నారు. కేసీఆర్ ముందువరుసలో కూర్చోగా ఆయన వెనకాలే సికింద్రాబాద్ MLA పద్మారావుగౌడ్, కరీంనగర్ MLA గంగుల కమలాకర్ కూర్చున్నారు. బడ్జెట్ ప్రసంగం ముగియగానే సభ వాయిదా పడటంతో కేసీఆర్ అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
Similar News
News January 29, 2026
ఫిబ్రవరి 2న సీఎం రేవంత్ కీలక సమావేశం

TG: అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 1న హైదరాబాద్ రానున్నారు. 2న మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. సింగరేణి టెండర్ల వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ, మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవడమే ప్రధాన ఎజెండాగా భేటీ జరగనుంది.
News January 29, 2026
ఈ సంకేతాలు ఉంటే కిడ్నీ సమస్యలు!

* ఎక్కువ/తక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లడం.
* ముఖం, పాదాల్లో వాపులు.
* నురుగు/గోధుమ రంగు/రక్తంతో మూత్రం రావడం.
* త్వరగా అలసిపోయినట్టు/అలసటగా అనిపించడం.
* కండరాల తిమ్మిర్లు.
* చర్మం పొడిబారడం, దురద పెట్టడం.
* ఊపిరి సరిగ్గా అందకపోవడం.
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
News January 29, 2026
50 పరుగుల తేడాతో భారత్ ఓటమి

విశాఖలో జరిగిన 4వ T20లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా 18.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయింది. ఒకానొక సమయంలో దూబె(65) చెలరేగి ఆడటంతో గెలుపు దిశగా పయనించింది. అతను ఔటవ్వగానే కావాల్సిన రన్రేట్ పెరిగిపోయి 50 పరుగుల తేడాతో ఓడింది. శాంట్నర్ 3, సోధీ, డఫీ చెరో 2 వికెట్లు తీశారు.


