News May 24, 2024

ఇబ్రాహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంపై తొలి నివేదిక

image

ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రాహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంపై ఆ దేశ ఆర్మీ తొలి నివేదిక విడుదల చేసింది. హెలికాప్టర్ ముందుగా నిర్ణయించిన మార్గంలోనే ప్రయాణించిందని, రూట్ దాటి వెళ్లలేదని తెలిపింది. ప్రమాదానికి 90sec ముందు ఆ చాపర్ పైలట్ కాన్వాయ్‌లోని ఇతర హెలికాప్టర్లను కాంటాక్ట్ చేశారని పేర్కొంది. శకలాల్లో బుల్లెట్లు, పేలుడు పదార్థాల ఆధారాలు కనిపించలేదని, కొండను ఢీకొని చాపర్‌లో మంటలు చెలరేగాయని వివరించింది.

Similar News

News November 15, 2025

ఇవి సర్‌ప్రైజ్ రిజల్ట్స్: రాహుల్ గాంధీ

image

బిహార్ అసెంబ్లీ ఫలితాలు ఆశ్చర్యపరిచాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల ప్రక్రియలో మొదటి నుంచీ అన్యాయం జరిగిందని, అందుకే తాము విజయం సాధించలేకపోయామని చెప్పారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే పోరాటం చేస్తున్నట్లు వివరించారు. ఓటమిపై కాంగ్రెస్, ఇండియా కూటమి లోతుగా సమీక్షించుకుని, మరింత బలంగా తిరిగివస్తామని పేర్కొన్నారు.

News November 15, 2025

బిహార్‌లో ‘నిమో’ డబుల్ సెంచరీ

image

బిహార్‌లో ఎన్నికల్లో నిమో(నితీశ్-మోదీ) ఆధ్వర్యంలోని NDA డబుల్ సెంచరీ కొట్టింది. 243 స్థానాలకు గానూ 203 సీట్లు కైవసం చేసుకుంది. BJP 90 స్థానాల్లో, JDU 85 చోట్ల, LJP 19 నియోజకవర్గాల్లో విజయం సాధించాయి. HAM-5, RLM-4 సీట్లు కైవసం చేసుకున్నాయి. అటు కాంగ్రెస్-RJD నేతృత్వంలోని మహాగఠ్ బంధన్ ఇప్పటివరకు 34 సీట్లకే పరిమితం అయింది. ఆర్జేడీ 24, INC-6 సీట్లు గెలుచుకున్నాయి.

News November 14, 2025

పడుకునే ముందు ఇవి తినవద్దు!

image

చాలా మంది లేట్ నైట్ పడుకునే ముందు కొన్ని రకాల స్నాక్స్, అన్‌హెల్దీ ఫుడ్ లాగించేస్తుంటారు. అది ఏమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పిజ్జా, బర్గర్స్, ఐస్‌క్రీమ్స్, కేక్స్, కూల్‌డ్రింక్స్ తీసుకోవద్దని చెబుతున్నారు. ఇవి జీర్ణ సంబంధిత సమస్యలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. అలాగే చికెన్, మటన్ తీసుకోవడం వల్ల అజీర్తితో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. రాత్రివేళ లైట్ ఫుడ్ తీసుకుంటే బెటర్.