News May 24, 2024
ఇబ్రాహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంపై తొలి నివేదిక

ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రాహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంపై ఆ దేశ ఆర్మీ తొలి నివేదిక విడుదల చేసింది. హెలికాప్టర్ ముందుగా నిర్ణయించిన మార్గంలోనే ప్రయాణించిందని, రూట్ దాటి వెళ్లలేదని తెలిపింది. ప్రమాదానికి 90sec ముందు ఆ చాపర్ పైలట్ కాన్వాయ్లోని ఇతర హెలికాప్టర్లను కాంటాక్ట్ చేశారని పేర్కొంది. శకలాల్లో బుల్లెట్లు, పేలుడు పదార్థాల ఆధారాలు కనిపించలేదని, కొండను ఢీకొని చాపర్లో మంటలు చెలరేగాయని వివరించింది.
Similar News
News October 14, 2025
రైడెన్తో వచ్చే ఉద్యోగాలెన్నో చెప్పాలి : YCP

AP: విశాఖలో గూగుల్ రైడెన్ సంస్థ డేటా సెంటర్ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ప్రభుత్వం చెప్పాలని YCP డిమాండ్ చేసింది. ‘ఆ సంస్థకు 500 ఎకరాలు, ₹22వేల కోట్ల రాయితీలిస్తున్నారు. రోజుకు 24 మిలియన్ యూనిట్లు విద్యుత్ అవసరం. కనీసం 20వేల ఉద్యోగాలైనా రావాలి. కానీ డేటా సెంటర్తో అన్ని జాబ్లు రావు. డెవలప్మెంటు సెంటర్తో ఐటీ పార్కును అభివృద్ధి చేయాలి’ అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు.
News October 14, 2025
ఇతిహాసాలు క్విజ్ – 35 సమాధానాలు

1. రామాయణంలో రాముడు, సుగ్రీవులు కిష్కింధ కాండంలో కలుస్తారు.
2. పాండవులు అరణ్యవాసం 12 సంవత్సరాలు చేశారు.
3. విష్ణువు మూడో అవతారం ‘వరాహ’.
4. కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడు ‘కృత్తికా’ నక్షత్రంతో కలిసి ఉంటాడు.
5. అరటి పండును సంస్కృతంలో కదళీ ఫలమని అంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 14, 2025
నాపై కొందరు రెడ్లు కుట్ర చేస్తున్నారు: సురేఖ

TG: తమ ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని కొందరు రెడ్లు చూస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ‘మేడారం జాతర పనుల బాధ్యతను మంత్రి పొంగులేటికి కూడా CM అప్పజెప్పారు. టెండర్ల ఖరారు పారదర్శకంగా జరిగి పనులు త్వరగా కావాలన్నదే నా ఉద్దేశం. మా మధ్య విభేదాలు లేవు. అయితే కొందరు ప్రతీది వివాదం చేయాలని చూస్తున్నారు’ అని చిట్చాట్లో పేర్కొన్నారు. హీరో <<17283242>>నాగార్జున <<>>కుటుంబ వ్యవహారంలోనూ వివాదం సృష్టించారన్నారు.