News October 26, 2024
12 ఏళ్లలో తొలిసారి స్వదేశంలో సిరీస్ ఓటమి

4331 రోజులుగా అనేక మేటి జట్లు భారత గడ్డపై టెస్టు సిరీస్ను గెలవలేకపోయాయి. ఈ 12 ఏళ్లలో ఏ దేశానికీ సాధ్యంకాని రికార్డును న్యూజిలాండ్ సాధించింది. 2012 తర్వాత స్వదేశంలో సిరీస్ ఓటమి తెలియని భారత్ను సునాయాసంగా ఓడించింది. మూడు మ్యాచుల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే గెలుచుకుంది. న్యూజిలాండ్కు భారత్లో ఇదే తొలి సిరీస్ విజయం. భారత్కు 18 సిరీస్ విజయాల తర్వాత ఇదే తొలి ఓటమి.
Similar News
News November 10, 2025
బిహార్: 122 స్థానాల్లో 1,302 మంది బరిలోకి

బిహార్లో రెండో విడత ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. 20 జిల్లాల పరిధిలోని 122 స్థానాలకు పోలింగ్ జరగనుండగా సుమారు 3.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వారిలో 136 మంది మహిళలు కావడం గమనార్హం. 45,399 కేంద్రాలలో పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో ఈ 122 స్థానాల్లో బీజేపీ 42, ఆర్జేడీ 33, జేడీయూ 20, కాంగ్రెస్ 11 సీట్లు గెలుచుకుంది.
News November 10, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 10, 2025
పవన్ పర్యటనలో అపశ్రుతిపై కలెక్టర్ క్లారిటీ

AP: డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో కాన్వాయ్ మహిళ కాలిపై నుంచి దూసుకెళ్లిందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని చిత్తూరు కలెక్టర్ సుమిత్ స్పష్టం చేశారు. పర్యటనలో జనాల తాకిడికి మహిళ సృహతప్పి పడిపోగా తొక్కిసలాటలో కాలికి గాయమైందన్నారు. బాధితురాలిని వెంటనే పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అన్ని పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఎడమ కాలుకు చిన్న గాయమైందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.


