News October 26, 2024
12 ఏళ్లలో తొలిసారి స్వదేశంలో సిరీస్ ఓటమి

4331 రోజులుగా అనేక మేటి జట్లు భారత గడ్డపై టెస్టు సిరీస్ను గెలవలేకపోయాయి. ఈ 12 ఏళ్లలో ఏ దేశానికీ సాధ్యంకాని రికార్డును న్యూజిలాండ్ సాధించింది. 2012 తర్వాత స్వదేశంలో సిరీస్ ఓటమి తెలియని భారత్ను సునాయాసంగా ఓడించింది. మూడు మ్యాచుల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే గెలుచుకుంది. న్యూజిలాండ్కు భారత్లో ఇదే తొలి సిరీస్ విజయం. భారత్కు 18 సిరీస్ విజయాల తర్వాత ఇదే తొలి ఓటమి.
Similar News
News February 3, 2026
ఎల్ఐసీ FPOకి రంగం సిద్ధం

వచ్చే FYలో LICలో మలి విడత పబ్లిక్ ఆఫరింగ్ (FPO)కు కేంద్రం సిద్ధమవుతోంది. సెబీ నిబంధనల ప్రకారం 2027 నాటికి పబ్లిక్ వాటాను 10%కి పెంచాల్సి ఉంది. దీంతో ప్రస్తుతం ఉన్న 96.5% ప్రభుత్వ వాటాలో మరో 6.5% తగ్గించనుంది. మార్కెట్ పరిస్థితులు అనుకూలిస్తేనే దీనికి అడుగులు పడతాయని ఆర్థిక సేవల శాఖ తెలిపింది. 2022లో IPOతో రూ.21,000 కోట్లు సమకూరాయి. ప్రస్తుతం సంస్థ మార్కెట్ విలువ రూ.5.08 లక్షల కోట్లుగా ఉంది.
News February 3, 2026
అంబటి, జోగి కుటుంబాలను పరామర్శించనున్న జగన్

AP: మాజీ CM, YCP అధ్యక్షుడు జగన్ రేపు గుంటూరులో పర్యటించనున్నారు. CM చంద్రబాబుపై అనుచిత వాఖ్యల కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శిస్తారు. అలాగే శుక్రవారం ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేశ్ సహా ఆయన కుటుంబాన్ని జగన్ కలవనున్నారు. TDP శ్రేణుల దాడిలో దెబ్బతిన్న రమేశ్ ఇంటిని పరిశీలిస్తారు. ఈ మేరకు YCP MLC తలశిల రఘురామ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
News February 3, 2026
వ్యవసాయంలో అధిక ఆదాయం ఇలా సాధ్యం

సాగులో సమీకృత వ్యవసాయంతో అధిక ఆదాయం సాధ్యమంటున్నారు నిపుణులు. భూమిని భాగాలుగా విభజించి వరి, చిరు ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను సాగు చేస్తూనే.. కోళ్లు, గొర్రెలు, మేకలు, పాడి పశువులు, చేపల పెంపకాన్ని చేపట్టడాన్నే సమీకృత వ్యవసాయం అంటారు. దీని వల్ల కొద్దిపాటి భూమిలోనే ఏడాది పొడవునా రైతులు ఆదాయం పొందవచ్చు. దీన్ని ఎలా చేయాలి? ఏ భూములకు అనుకూలమో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.


