News October 26, 2024
12 ఏళ్లలో తొలిసారి స్వదేశంలో సిరీస్ ఓటమి

4331 రోజులుగా అనేక మేటి జట్లు భారత గడ్డపై టెస్టు సిరీస్ను గెలవలేకపోయాయి. ఈ 12 ఏళ్లలో ఏ దేశానికీ సాధ్యంకాని రికార్డును న్యూజిలాండ్ సాధించింది. 2012 తర్వాత స్వదేశంలో సిరీస్ ఓటమి తెలియని భారత్ను సునాయాసంగా ఓడించింది. మూడు మ్యాచుల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే గెలుచుకుంది. న్యూజిలాండ్కు భారత్లో ఇదే తొలి సిరీస్ విజయం. భారత్కు 18 సిరీస్ విజయాల తర్వాత ఇదే తొలి ఓటమి.
Similar News
News January 2, 2026
NZలో ఆవు మూత్రం.. 2 లీటర్లకు రూ.13వేలు

న్యూజిలాండ్ ఆక్లాండ్లోని Navafresh అనే ఇండియన్ స్టోర్లో ఆవు మూత్రం, పేడ అమ్ముతుండటంతో అక్కడి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఆవు మూత్రం 2 లీటర్లకు 253 డాలర్లు (రూ.13వేలు), ఆవు పేడ కేజీ 220 డాలర్లు (రూ.11వేలు), ఆవు పేడతో చేసిన బేబీ పౌడర్ 214-250 డాలర్లుగా ఉన్నట్లు ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. వీటిలో శక్తిమంతమైన యాంటీ బయోటిక్స్ ఉంటాయని, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని వాటిపై రాసినట్లుందని ఆమె పేర్కొన్నారు.
News January 2, 2026
AMPRIలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

CSIR-అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (AMPRI)లో 13 పోస్టులకు అప్లై చేయడానికి జనవరి 4 ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిప్లొమా, బీఎస్సీ(సైన్స్, CS), టెన్త్, ఐటీఐ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. టెక్నికల్ అసిస్టెంట్కు నెలకు రూ.66,500, టెక్నీషియన్కు రూ.37,000 చెల్లిస్తారు. వెబ్సైట్: https://ampri.res.in
News January 2, 2026
సిద్ధమవుతున్న బరులు.. సన్నద్ధమవుతున్న పుంజులు

సంక్రాంతికి కోడి పందేల కోసం గోదావరి జిల్లాల్లో బరులు సిద్ధమవుతున్నాయి. చాలాచోట్ల పొలాలను చదును చేసి బరులుగా మారుస్తున్నారు. ఇక కొన్నిచోట్ల అయితే బరుల వద్దే సోఫా సీటింగ్, ACలు, లైవ్ స్క్రీన్స్ కోసం ఆర్డర్స్ వచ్చినట్లు షామియానాల నిర్వాహకులు తెలిపారు. అటు కోడిపుంజులనూ పందెంరాయుళ్లు సన్నద్ధం చేస్తున్నారు. రెగ్యులర్గా జీడిపప్పు, బాదం తదితర డైట్ ఫుడ్కు తోడు ఎక్కువ ఎక్సర్సైజులు చేయిస్తున్నారు.


