News May 3, 2024
అమేథీలో 26ఏళ్ల తర్వాత తొలిసారిగా – 1/2

అమేథీ ఎంపీ సీటు అభ్యర్థిగా కిశోరీ లాల్ శర్మను కాంగ్రెస్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. 26ఏళ్ల తర్వాత మళ్లీ గాంధీయేతర వ్యక్తి బరిలో నిలిచారు. చివరగా 1998లో సతీశ్ శర్మ ఇక్కడ పోటీ చేశారు. 1980లో తొలిసారిగా సంజయ్ గాంధీ పోటీ చేసి గెలిచారు. హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన చనిపోవడంతో 1981 బైపోల్స్లో సోదరుడు రాజీవ్ గాంధీ పోటీ చేసి గెలిచారు. 1991లో రాజీవ్ మరణం తర్వాత ఆ సీటు సతీశ్ శర్మకు వెళ్లింది. <<-se>>#Elections2024<<>>
Similar News
News January 28, 2026
ఈ ఉంగరం ధరిస్తే..

జ్యోతిషం ప్రకారం పుష్పరాగం ఎంతో పవిత్రమైనది. ఈ రత్నం గురు గ్రహానికి ప్రతీక. జ్ఞానం, సంపద, సంతోషకర వివాహ జీవితం కోసం దీన్ని ధరిస్తారు. మహిళలకు వివాహ జాప్యం తొలగడానికి, విద్యార్థులు చదువులో రాణించడానికి, ఆర్థిక స్థిరత్వం కోసం ఇది బాగా పనిచేస్తుందని నమ్మకం. పగుళ్లు లేని, పారదర్శకమైన బంగారు రంగు పుష్పరాగం ధరిస్తే ఆత్మవిశ్వాసం పెరిగి, దైవానుగ్రహం లభిస్తుందట. జీవితంలో అడ్డంకులు తొలగుతాయని నమ్ముతారు.
News January 28, 2026
NIT కాలికట్లో అప్రెంటిస్ పోస్టులు

<
News January 28, 2026
అరటిలో జింకు ధాతు లోపం – నివారణ

అరటిలో జింకు ధాతు లోపం వల్ల లేత ఆకులు, ఈనెల వెంబటి తెల్లని చారలు ప్రారంభమై ఈనెలు పాలిపోయినట్లు లేదా పసుపు రంగుకు మారతాయి. ఈనెల వెనుక ముదురు ఊదా రంగు ఏర్పడుతుంది. ఇది తీవ్రమైతే చెట్టు ఎదుగుదల నిలిచి, గెల, పండు పరిమాణం, నాణ్యత తగ్గుతుంది. దీని నివారణకు లీటరు నీటికి జింక్ సల్ఫేట్ 2 గ్రాములను, జిగురు మందుతో కలిపి తెగులు సోకిన మొక్క ఆకులపై 10 రోజుల వ్యవధిలో 2 లేక 3 సార్లు పిచికారీ చేయాలి.


