News January 30, 2025

దేశంలోనే తొలిసారి.. లోకేశ్‌కు అభినందనలు: CM

image

AP: రాష్ట్ర ప్రజలకు ‘మన మిత్ర’ పథకాన్ని అంకితం చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘161 సేవలు అందజేసే ‘మన మిత్ర’ ప్రక్రియ ఓ మైలురాయి. మంత్రి లోకేశ్ మంచి ఆలోచనతో దీన్ని రూపొందించారు. దేశంలోనే తొలిసారి ఈ తరహా సేవలు అందుబాటులోకి తెచ్చాం. లోకేశ్, మెటా భారత ఉపాధ్యక్షుడు సంధ్యా దేవనాథన్‌కు అభినందనలు’ అని CM తెలిపారు. ఇవాళ మంత్రి లోకేశ్ ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన విషయం తెలిసిందే.

Similar News

News January 26, 2026

ఫ్రెండ్ పెళ్లి కోసం 15 కేజీలు తగ్గిన మహిళ.. చివరికి!

image

తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్లిలో అందంగా కనిపించడం కోసం చైనాలో జియాయు అనే 26 ఏళ్ల యువతి కఠిన డైట్ పాటించింది. రోజూ 10KM రన్నింగ్ చేస్తూ తక్కువ మొత్తంలో వెజిటబుల్స్, చికెన్ తినేది. దీంతో 2 నెలల్లోనే 15KGల బరువు తగ్గింది. ఆమె తన డైట్ నుంచి కార్బొహైడ్రేట్స్‌ను తీసేయడం, హై ఇంటెన్సిటీ ఎక్సర్‌సైజ్ వల్ల ప్రీ డయాబెటిస్ బారిన పడింది. డాక్టర్ల వార్నింగ్‌తో ఆమె డైటింగ్‌ను ఆపేసింది.

News January 26, 2026

బాలిక ప్రాణం తీసిన చైనా మాంజా

image

TG: హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. చైనా మాంజా మరొకరి ప్రాణం తీసింది. తండ్రితో కలిసి బైక్‌పై వెళ్తున్న ఐదేళ్ల నిష్విక(5) మెడను మాంజా మహమ్మారి కోసేసింది. దీంతో తీవ్ర రక్తస్రావంతో చిన్నారి విలవిల్లాడింది. తండ్రి వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. <<18870079>>చైనా మాంజా<<>>పై ఇండియాలో నిషేధం ఉన్నా, పోలీసుల హెచ్చరికలు ఉన్నా వాటి అమ్మకాలు ఆగకపోవడం శోచనీయం.

News January 26, 2026

రేపు బ్యాంకులు బంద్!

image

బ్యాంక్ ఉద్యోగులు రేపు బంద్‌కు పిలుపునిచ్చారు. వారంలో 5 వర్కింగ్‌ డేస్‌ను డిమాండ్ చేస్తూ బ్యాంకు యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. జనవరి 23న ఈ మేరకు ప్రకటన వెలువడింది. గత బుధవారం, గురువారం ఈ విషయంపై చీఫ్ లేబర్ కమిషనర్‌తో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో సమ్మె యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది! ఇప్పటికే పలు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు తమ సేవల్లో అంతరాయం ఏర్పడొచ్చంటూ కస్టమర్లకు మెసేజ్‌లు పంపాయి.