News January 30, 2025
దేశంలోనే తొలిసారి.. లోకేశ్కు అభినందనలు: CM

AP: రాష్ట్ర ప్రజలకు ‘మన మిత్ర’ పథకాన్ని అంకితం చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘161 సేవలు అందజేసే ‘మన మిత్ర’ ప్రక్రియ ఓ మైలురాయి. మంత్రి లోకేశ్ మంచి ఆలోచనతో దీన్ని రూపొందించారు. దేశంలోనే తొలిసారి ఈ తరహా సేవలు అందుబాటులోకి తెచ్చాం. లోకేశ్, మెటా భారత ఉపాధ్యక్షుడు సంధ్యా దేవనాథన్కు అభినందనలు’ అని CM తెలిపారు. ఇవాళ మంత్రి లోకేశ్ ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన విషయం తెలిసిందే.
Similar News
News November 16, 2025
పొదచిక్కుడులో కాయతొలిచే పురుగు నివారణ

పొద చిక్కుడు పూత, కాయ దశల్లో కాయతొలిచే పురుగు ఆశించి కాయలోని పదార్థాలను తినేస్తుంది. దీని వల్ల కాయ నాణ్యత, దిగుబడి తగ్గిపోతుంది. కాయతొలిచే పురుగు నివారణకు ఫ్లూబెండమైడ్ 39.35% ఎస్.సి. 60 మి.లీ. లేదా క్లోరంత్రానిలిప్రోల్ 18.5% ఎస్.సి. 60 మి.లీ. లేదా స్పైనోశాడ్ 45% ఎస్.సి. 60 మి.లీ.తో పాటు జిగురు 100 మి.లీ. కలిపి ఎకరానికి సరిపడా 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
News November 16, 2025
HAPPY SUNDAY

వారమంతా ఆఫీస్ పనులతో, ఇతర బాధ్యతలతో తీరిక లేకుండా గడిపిన వారికి ఈ రోజు కాస్త బ్రేక్ అవసరం. పనుల ఒత్తిడిని పూర్తిగా పక్కన పెట్టి, మనసుకు నచ్చిన పనులు చేస్తూ రిలాక్స్ అవ్వండి. సినిమాలు చూడటం, నచ్చిన పాటలు వినడం, కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడపడం లేదా పుస్తకం చదవడం వంటివి చేయండి. మనసుకు, శరీరానికి ఈ విశ్రాంతి చాలా అవసరం. మళ్లీ వారమంతా ఉత్సాహంగా గడపాలంటే ఇవాళ రీఛార్జ్ చేయాల్సిందేగా..!
News November 16, 2025
iBOMMA, BAPPAM సైట్లు బ్లాక్

iBOMMA, BAPPAM సైట్లను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బ్లాక్ చేశారు. దీంతో నిన్న రాత్రి నుంచి ఆ సైట్లు ఓపెన్ అవ్వడం లేదు. iBOMMA సైట్లో 1XBet అనే <<18296786>>బెట్టింగ్<<>>, ఆన్లైన్ గేమింగ్ యాప్ను నిర్వాహకుడు ఇమ్మడి రవి ప్రమోట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సినిమాలు చూసేవారిని బెట్టింగ్ వైపు మళ్లించడం అతడి ప్లాన్ అని, ఇందుకోసం బెట్టింగ్ కంపెనీల నుంచి భారీగా నిధులు తీసుకున్నట్లు తెలుస్తోంది.


