News January 30, 2025

దేశంలోనే తొలిసారి.. లోకేశ్‌కు అభినందనలు: CM

image

AP: రాష్ట్ర ప్రజలకు ‘మన మిత్ర’ పథకాన్ని అంకితం చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘161 సేవలు అందజేసే ‘మన మిత్ర’ ప్రక్రియ ఓ మైలురాయి. మంత్రి లోకేశ్ మంచి ఆలోచనతో దీన్ని రూపొందించారు. దేశంలోనే తొలిసారి ఈ తరహా సేవలు అందుబాటులోకి తెచ్చాం. లోకేశ్, మెటా భారత ఉపాధ్యక్షుడు సంధ్యా దేవనాథన్‌కు అభినందనలు’ అని CM తెలిపారు. ఇవాళ మంత్రి లోకేశ్ ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన విషయం తెలిసిందే.

Similar News

News November 16, 2025

రేపటి నుంచి స్కూళ్లలో ఆధార్ స్పెషల్ క్యాంపులు

image

AP: రాష్ట్రంలోని స్కూళ్లలో రేపటి నుంచి ఈ నెల 26 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులను ప్రభుత్వం నిర్వహించనుంది. 5-15 ఏళ్ల పిల్లలు వారి బయోమెట్రిక్, పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ తదితర వివరాలను అప్డేట్ చేసుకునేందుకు వీలు ఉంటుంది. విద్యార్థుల వెంట పేరెంట్స్ వారి ఆధార్ కార్డును తీసుకెళ్లాలి. కాగా రాష్ట్రంలో ఇప్పటికీ 15.46 లక్షల మంది పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాల్సి ఉందని అధికారులు తెలిపారు.

News November 16, 2025

ఫర్నిచర్ కొనేటప్పుడు ఈ పొరపాట్లు చేయొద్దు

image

ఆఫర్‌ ఉందనో, డిజైన్‌ నచ్చిందనో తొందరపడి ఫర్నిచర్ కొనుగోలు చేయకూడదని సూచిస్తున్నారు నిపుణులు. నిజంగా మీకు ఆ వస్తువు అవసరం ఉందో, లేదో.. ఆలోచించండి. తక్కువ ధరకు దొరుకుతుందని నాణ్యతను పట్టించుకోకపోతే నష్టపోతారు. నాణ్యతే ముఖ్యమన్న విషయం గుర్తుంచుకోవాలి. ట్రెండ్‌ను ఫాలో అవుతూ కొనుగోలు చేయొద్దు. అది ఎప్పుటికప్పుడు మారుతూ ఉంటుంది. కాబట్టి.. చూడటానికి ఆకర్షణీయంగా, సౌకర్యవంతంగా ఉండేవి ఎంచుకోవడం మంచిది.

News November 16, 2025

3Dలోనూ అఖండ-2

image

బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలకృష్ణ నటిస్తోన్న అఖండ-2 సినిమాను 3Dలోనూ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫ్యాన్స్‌కు కొత్త అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ఫార్మాట్‌లోనూ తీసుకొస్తున్నట్లు బోయపాటి చెప్పారు. ‘ఈ చిత్రం దేశ ఆత్మ, పరమాత్మ. సనాతన ధర్మం ఆధారంగా మూవీని రూపొందించాం. ఈ సినిమాను దేశమంతా చూడాలనుకుంటున్నాం. అందుకే ముంబై నుంచి ప్రచారం ప్రారంభించాం’ అని పేర్కొన్నారు.