News July 12, 2024

సికింద్రాబాద్-ముంబై మధ్య తొలి ‘వందేభారత్ స్లీపర్’?

image

TG: వందేభారత్‌లో తొలి స్లీపర్ రైలు సిక్రింద్రాబాద్-ముంబై మధ్య వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ రెండు సిటీల మధ్య ఇప్పటి వరకు వందేభారత్ రైలు లేదు. ఈ నేపథ్యంలో స్లీపర్‌ను నడపాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన సూచనల మేరకు రైల్వే బోర్డుకు దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు పంపింది. ఇక సికింద్రాబాద్-పుణే మధ్య నడుస్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో సాధారణ వందేభారత్‌ రైలును నడపనున్నట్లు సమాచారం.

Similar News

News December 9, 2025

గజగజ.. రేపు కూడా చలి తీవ్రత

image

తెలంగాణలో చలి వణికిస్తోంది. హైదరాబాద్‌ సహా జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రేపు కూడా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, హైదరాబాద్‌లో టెంపరేచర్ 6-8 డిగ్రీలకు పడిపోనున్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. ఉదయం, రాత్రి వేళల్లో ప్రయాణాలు మానుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులను బయటికి తీసుకెళ్లవద్దని సూచిస్తున్నారు.

News December 9, 2025

‘తెలంగాణ విజన్ -2047’ డాక్యుమెంట్.. కీలక అంశాలు

image

⋆ 2047 నాటికి $3T ఆర్థిక వ్యవస్థే ప్రధాన లక్ష్యం
⋆ 10 కీలక వ్యూహాలతో డాక్యుమెంట్, సమతుల్య అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజన (CURE, PURE, RARE)
⋆ పెట్టుబడుల ఆకర్షణ, పాలనలో పారదర్శకత, ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం వంటి ప్రాజెక్టులు. కళలు, పర్యాటకాన్ని పరిరక్షించడం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విధానాల రూపకల్పన వంటివి ఇందులో ఉన్నాయి. పూర్తి డాక్యుమెంట్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News December 9, 2025

ఇదీ సంగతి: ఫోన్‌పే కొట్టు.. ఓటు పట్టు!

image

TG: రాష్ట్రంలో తొలి విడత ఎన్నికలకు ప్రచారం ముగియడంతో అభ్యర్థులు, వారి మద్దతుదారులు ప్రలోభాలకు తెరలేపారు. గ్రామంలో ఉన్న ఓటర్లకు నేరుగా డబ్బులు పంచుతుండగా వలస ఓట్లపైనా దృష్టి పెట్టారు. వారికి ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. తప్పకుండా తమకే ఓటు వేయాలని కోరుతున్నారు. ఫోన్‌పే, గూగుల్ పే వంటి UPI పేమెంట్స్ ద్వారా డబ్బులు పంపుతున్నారు. ఓటుకు రేట్ కట్టడంతో పాటు రానుపోను దారి ఖర్చులకు ‘Pay’ చేస్తున్నారు.